కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా మొదటి వేవ్ సమయంలో మాస్కులను ధరించడంపై అనేక మందికి అనేక సందేహాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్లీ అవే సందేహాలు వస్తున్నాయి. మాస్కులను ఎక్కువ సేపు ధరించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయని, కార్బన్ డయాక్సైడ్కు శరీరం విషతుల్యంగా మారుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్కులను ఎక్కువ సమయం పాటు ధరించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయనే వార్త పూర్తిగా అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ఫ్యాక్ట్ చెక్లో తెలియజేసింది. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయని, అవన్నీ అబద్దమని తేల్చి చెప్పింది. మాస్కులను ధరించడం వల్ల కొందరికి అసౌకర్యంగా ఉంటుందని, అంతేకానీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గవని తెలిపింది. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువ సమయం పాటు మాస్కులను, పీపీఈ కిట్లను ధరిస్తారు కనుక వారిలో తలనొప్పి, ముఖం నొప్పి, వాపులు వంటి సమస్యలు వస్తాయని, అంతేకానీ వారిలో కూడా ఆక్సిజన్ స్థాయిలు తగ్గవని, అదంతా అబద్దమని తేల్చి చెప్పింది.
కోవిడ్ మొదటి వేవ్లో అందరూ సింగిల్ మాస్క్నే ధరించారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్లో కొత్త కొత్త కరోనా వేరియెంట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు రెండు మాస్కుల చొప్పున ధరించాలని, కోవిడ్ బాధితులు అయితే 3 మాస్క్లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులను ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించడం వల్ల కూడా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…