కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా మొదటి వేవ్ సమయంలో మాస్కులను ధరించడంపై అనేక మందికి అనేక సందేహాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్లీ అవే సందేహాలు వస్తున్నాయి. మాస్కులను ఎక్కువ సేపు ధరించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయని, కార్బన్ డయాక్సైడ్కు శరీరం విషతుల్యంగా మారుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్కులను ఎక్కువ సమయం పాటు ధరించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయనే వార్త పూర్తిగా అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ఫ్యాక్ట్ చెక్లో తెలియజేసింది. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయని, అవన్నీ అబద్దమని తేల్చి చెప్పింది. మాస్కులను ధరించడం వల్ల కొందరికి అసౌకర్యంగా ఉంటుందని, అంతేకానీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గవని తెలిపింది. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువ సమయం పాటు మాస్కులను, పీపీఈ కిట్లను ధరిస్తారు కనుక వారిలో తలనొప్పి, ముఖం నొప్పి, వాపులు వంటి సమస్యలు వస్తాయని, అంతేకానీ వారిలో కూడా ఆక్సిజన్ స్థాయిలు తగ్గవని, అదంతా అబద్దమని తేల్చి చెప్పింది.
కోవిడ్ మొదటి వేవ్లో అందరూ సింగిల్ మాస్క్నే ధరించారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్లో కొత్త కొత్త కరోనా వేరియెంట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు రెండు మాస్కుల చొప్పున ధరించాలని, కోవిడ్ బాధితులు అయితే 3 మాస్క్లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులను ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించడం వల్ల కూడా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…