సాధారణంగా పెళ్లైన మహిళలు తమ నుదుటిపై సింధూరం పెట్టుకుంటుంటారు. అదేవిధంగా పూజ చేసిన తర్వాత, ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ దేవుడిని దర్శించుకుని బొట్టు పెట్టుకొంటారు. ఈ విధంగా బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. ఇక పెళ్లైన మహిళలు నుదుటన బొట్టు పెట్టుకోవడం వల్ల తన భర్తకు ఆయుష్షును అందిస్తుందని భావిస్తారు. అయితే హిందూ శాస్త్రం ప్రకారం ఏ వేలితో బొట్టు పెట్టుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ శాస్త్రం ప్రకారం మన చేతి వేళ్లలో మధ్య వేలును శని స్థానంగా భావిస్తారు. శనిగ్రహం మనకు దీర్ఘకాల ఆయుష్షును కలిగిస్తుంది. కనుక ఈ వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బొటన వేలుతో బొట్టు పెట్టుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, ధైర్యం లభిస్తాయి.
చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోవడం ద్వారా మోక్షం లభిస్తుంది. మన శరీరంలో కేవలం నుదుటిపై మాత్రమే కాకుండా 15 స్థానాలలో బొట్టు పెట్టుకోవచ్చు. కానీ చాలామంది ఎరుపు రంగు కుంకుమను నుదుటిపై పెట్టుకుంటారు. ఎందుకంటే నుదురు అంగారకుడి స్థానం. అదేవిధంగా అంగారకుడు ఎరుపు రంగులో ఉండటం వల్ల ఎరుపు రంగు సింధూరం నుదుటిపై ధరించడం ఆనవాయితీగా వస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…