కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నెల చివరి నుంచి పలు దశల్లో విడతల వారీగా దేశవ్యాప్త లాక్ డౌన్ను విధించి అమలు చేశారు. అయితే ఈ సారి మాత్రం దేశవ్యాప్త లాక్ డౌన్ లేదు. ఆ బాధ్యతను కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. దీంతో రాష్ట్రాలు తమకు తాముగా లాక్ డౌన్ లను విధించుకుంటున్నాయి. అయితే కోవిడ్ మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో మరోమారు దేశవ్యాప్త లాక్డౌన్ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కోవిడ్ మూడో వేవ్ ముప్పు పొంచి ఉంది కనుక జూలై 1 నుంచి 31వ తేదీ వరకు దేశ వ్యాప్త లాక్డౌన్ విధించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ వార్తను అబద్దమని తేల్చింది. అలాంటి ఉత్తర్వులను కేంద్రం జారీ చేయలేదని, కనుక అది ఫేక్ వార్త అని తెలిపింది.
కాగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే అనేక పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఏదో, ఫేక్ వార్త ఏదో ప్రజలు తెలుసుకోలేక కన్ఫ్యూజన్కు గురవుతున్నారు. అందుకనే పీఐబీ ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రజలకు నిజాలను తెలియజేస్తోంది. ఇక పైన తెలిపిన వార్తను కూడా పీఐబీ తన ఫ్యాక్ట్ చెక్ ద్వారా అబద్దమని తేల్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…