కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నెల చివరి నుంచి పలు దశల్లో విడతల వారీగా దేశవ్యాప్త లాక్ డౌన్ను విధించి అమలు చేశారు. అయితే ఈ సారి మాత్రం దేశవ్యాప్త లాక్ డౌన్ లేదు. ఆ బాధ్యతను కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. దీంతో రాష్ట్రాలు తమకు తాముగా లాక్ డౌన్ లను విధించుకుంటున్నాయి. అయితే కోవిడ్ మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో మరోమారు దేశవ్యాప్త లాక్డౌన్ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కోవిడ్ మూడో వేవ్ ముప్పు పొంచి ఉంది కనుక జూలై 1 నుంచి 31వ తేదీ వరకు దేశ వ్యాప్త లాక్డౌన్ విధించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ వార్తను అబద్దమని తేల్చింది. అలాంటి ఉత్తర్వులను కేంద్రం జారీ చేయలేదని, కనుక అది ఫేక్ వార్త అని తెలిపింది.
కాగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే అనేక పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఏదో, ఫేక్ వార్త ఏదో ప్రజలు తెలుసుకోలేక కన్ఫ్యూజన్కు గురవుతున్నారు. అందుకనే పీఐబీ ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రజలకు నిజాలను తెలియజేస్తోంది. ఇక పైన తెలిపిన వార్తను కూడా పీఐబీ తన ఫ్యాక్ట్ చెక్ ద్వారా అబద్దమని తేల్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…