స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు తాజాగా హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నేరస్థులు మోసం చేసేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారని ఎస్బీఐ తెలిపింది. అందువల్ల అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ హెచ్చరించింది. ఈ మేరకు ఎస్బీఐ ట్వీట్ చేసింది.
మీకు గిఫ్ట్లు పంపిస్తామంటూ ఏమైనా మెసేజ్లు, ఈ-మెయిల్స్ వస్తున్నాయా ? అయితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఆ మెసేజ్లు నమ్మి అందులో ఉండే లింక్లను ఓపెన్ చేస్తే వారు మీ బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్, యూపీఐ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను అడుగుతారు. మీరు నమ్మి ఆ వివరాలను ఆ లింక్లో ఉన్న వెబ్సైట్లో ఎంటర్ చేస్తే అంతే సంగతులు. వెంటనే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు మొత్తం క్షణాల్లో మాయమవుతుంది. ప్రస్తుతం ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కనుక ఎవరైనా సరే మీకు బహుమతులను పంపిస్తామని, బ్యాంకు వివరాలను ఎంటర్ చేయాలని అడిగితే అస్సలు నమ్మకూడదని ఎస్బీఐ హెచ్చరించింది.
ఇక బ్యాంకు ఎప్పుడు ఖాతాదారులకు చెందిన వివరాలను అడగదని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎస్బీఐ తెలిపింది. బహుమతులను పంపేవారు డబ్బులు అడగరని, డబ్బులు అడుగుతున్నారంటే అందులో మోసం ఉందని గ్రహించాలని ఎస్బీఐ తెలియజేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…