కరోనా సెకండ్ వేవ్ సమయంలో సోషల్ మీడియాలో అనేక తప్పుడు, ఫేక్ వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు కావాలని పనిగట్టుకుని మరీ కరోనా వ్యాక్సినేషన్పై తప్పుడు వార్తలను సృష్టిస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇక తాజా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కరోనా వ్యాక్సిన్పై ఓ సెన్సేషనల్ వార్తను ప్రచారం చేస్తున్నారు.
కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల్లో టీకా వేయించుకున్న చేతి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన చేతిని బల్బు మీద ఉంచగానే ఆ బల్బు వెలుగుతుంది. వీడియోలో ఆ దృశ్యాలను చూడవచ్చు. కోవిడ్ వ్యాక్సిన్లో లోహాలు లేదా చిన్నపాటి చిప్స్ ఉంటున్నాయని, అందువల్ల టీకాలను తీసుకున్న తరువాత టీకా వేయించుకున్న చేతి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆ వీడియోలో చెప్పారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ విషయాన్ని పరిశీలించి అసలు నిజం చెప్పింది. టీకా వేయించుకున్న చేతి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రచారం అవుతున్న ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ టీకాలలో లోహాలు కానీ, మైక్రో చిప్లు కానీ లేవని, ఆ వార్త పూర్తిగా అసత్యం అని తేల్చి చెప్పింది. అందువల్ల ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి సెన్సేషనల్ వార్తలను నమ్మకూడదని హెచ్చరించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…