కరోనా సెకండ్ వేవ్ సమయంలో సోషల్ మీడియాలో అనేక తప్పుడు, ఫేక్ వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు కావాలని పనిగట్టుకుని మరీ కరోనా వ్యాక్సినేషన్పై తప్పుడు వార్తలను సృష్టిస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇక తాజా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కరోనా వ్యాక్సిన్పై ఓ సెన్సేషనల్ వార్తను ప్రచారం చేస్తున్నారు.
కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల్లో టీకా వేయించుకున్న చేతి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన చేతిని బల్బు మీద ఉంచగానే ఆ బల్బు వెలుగుతుంది. వీడియోలో ఆ దృశ్యాలను చూడవచ్చు. కోవిడ్ వ్యాక్సిన్లో లోహాలు లేదా చిన్నపాటి చిప్స్ ఉంటున్నాయని, అందువల్ల టీకాలను తీసుకున్న తరువాత టీకా వేయించుకున్న చేతి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆ వీడియోలో చెప్పారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ విషయాన్ని పరిశీలించి అసలు నిజం చెప్పింది. టీకా వేయించుకున్న చేతి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రచారం అవుతున్న ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ టీకాలలో లోహాలు కానీ, మైక్రో చిప్లు కానీ లేవని, ఆ వార్త పూర్తిగా అసత్యం అని తేల్చి చెప్పింది. అందువల్ల ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి సెన్సేషనల్ వార్తలను నమ్మకూడదని హెచ్చరించింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…