Mahesh Babu : టాలీవుడ్లో మహేష్ బాబు, నమ్రత చూడచక్కని జంట. టాలీవుడ్ లోని బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరు అనే ప్రశ్న వస్తే మహేష్ బాబు నమ్రత ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యం ఎంతో మంది సినీ తారలకు ఆదర్శంగా నిలుస్తుంది. వంశీ చిత్రం సమయంలో మొదలైన వీరి ప్రేమ కథ ఆ తర్వాత వివాహ బంధానికి దారితీసింది. నమ్రత ఎప్పుడు మహేష్ బాబుకు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. సినిమాలకంటే ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వివాహం తర్వాత సినీ జీవితానికి స్వస్తి చెప్పారు నమ్రత.
మహేష్ బాబు కూడా చాలా సందర్భాలలో తనకు నమ్రత ఎక్కువగా సపోర్ట్ చేస్తుందని, తాను తీసుకునే ఆహారం నుండి ప్రతి విషయం పట్ల నమ్రత చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని మహేష్ బాబు తెలిపారు. తాను ఈ స్థానంలో ఉండటానికి నమ్రతనే కారణం అంటూ భార్య గురించి ఎంతో చక్కగా మహేష్ బాబు అనేక ఇంటర్వ్యూల్లో తెలియజేశారు. ఇక వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నమ్రత వంశీ అనే సినిమాలో కలిసి నటించారు. వంశీ సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నమ్రత, మహేష్ బాబు ప్రేమలో పడ్డారు. మొదట వీరి వివాహానికి మహేష్ బాబు తండ్రి కృష్ణ నిరాకరించారని అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి. హీరోయిన్ ను పెళ్ళి చేసుకోవడం కృష్ణకు ఇష్టం లేదని అప్పటిలో బాగా టాక్ వినిపించింది. అంతేకాకుండా నమ్రత తెలుగు అమ్మాయి కాకపోవడం వల్ల కృష్ణ మహేష్ బాబుతో నమ్రత పెళ్లికి నిరాకరించారని వార్తలు ప్రచారమయ్యాయి.
చివరికి సూపర్ స్టార్ కృష్ణను మహేష్ బాబు ఒప్పించారని ప్రచారం కూడా జరిగింది. ఇక నమ్రత మహేష్ బాబుల వివాహం 2005లో చెన్నైలో చాలా సింపుల్ గా కేవలం కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. అయితే దీనికి కారణం కూడా మహేష్ బాబు తండ్రి కృష్ణ పెళ్ళికి ఒప్పుకోక పోవడమే అని అప్పట్లో టాక్ వినిపించింది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…