Who is Shriya Reddy : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ముఖ్య పాత్రలు పోషించిన అందరికి మంచి గుర్తింపు దక్కింది.ఈ చిత్రంలో బలమైన పాత్రతో ఆకట్టుకొన్న రాధా రమా మన్నార్ పాత్ర క్యారెక్టర్లో తనదైన శైలిలో నటించిన శ్రీయా రెడ్డి కూడా మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఇప్పుడు శ్రియా రెడ్డి బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రంలొ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరదరాజ మన్నార్ పాత్రకు సోదరిగా శ్రియా రెడ్డి నటించారు.
శ్రియా రెడ్డి ఇదివరకే తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా విలనిజం పండించడంలో ఆమె నటన వేరేలెవల్. శ్రియా రెడ్డి ఓ మాజీ ఇండియన్ క్రికెటర్ కూతురు అన్న సంగతి చాలా మందికి తెలియదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన శ్రియా.. నిజానికి తెలుగమ్మాయే. మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ రెడ్డి కూతురు శ్రియా కాగా, ఆమె తండ్రి 1977 నుంచి 1981 మధ్య ఇండియన్ టీమ్ తరపున 4 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. భరత్ రెడ్డి కూతురు అయిన శ్రియ రెడ్డి కెరీర్ ప్రారంభంలో టీవీ ప్రజెంటర్, వీడియో జాకీగా పనిచేసింది. 41 ఏళ్ల ఈ నటి తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. 2002లో వచ్చిన సమురాయ్ మూవీతో పరిచయమైంది. 2006లో శర్వానంద్ నటించిన అమ్మ చెప్పింది మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
తెలుగు కుటుంబం అయిన కూడా వారు కొన్ని పరిస్థితులలో చెన్నైలో స్థిరపడ్డారు. 2008లో నటుడు విశాల్ అన్న విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకోవడం విశేషం. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పటి వరకూ పెద్దగా గుర్తింపు రాకపోయినా.. సలార్, పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలతో శ్రియా రెడ్డి పేరు వార్తల్లో నిలుస్తోంది.ఓజీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సెట్లో ప్రకాశ్ రాజ్తో నేను గొప్పంటే.. నేను గొప్ప అని పోట్లాడుకొన్నాం. సలార్, ఓజీ సినిమాల తర్వాత నేను రిటైర్మెంట్ అవుతాను. మళ్లీ యాంకర్, వీడియో జాకీగా వ్యవహరించను. కావాలంటే ఏదైనా షోను హోస్ట్ చేయాలని అనుకొంటున్నాను అంటూ ఇటీవల చెప్పుకొచ్చింది శ్రీయా రెడ్డి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…