Venky 75 OTT Streaming : విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. అలానే మల్టీ స్టారర్ చిత్రాలతో అలరిస్తున్నాడు. వెంకీ ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు చేస్తూనే మరోవైపు రానా నాయుడు లాంటి బోల్డ్ కంటెంట్ నేపథ్యం ఉన్న వెబ్ సిరీస్ చేసారు. ఓ వెబ్ సిరీస్ చేశారు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ సినిమాను చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 22న వస్తున్నట్లు ప్రకటించారు. అదే డేట్కు సలార్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో సైంధవ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టీమ్ తాజాగా ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 13న భారీగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే రీసెంటగా వెంకీ 75 అనే కార్యక్రమాన్ని నిర్వహించింది సైంథవ్ మూవీ నిర్మాతల బృందం. వెంకీ 75 సినిమాల ప్రయాణాన్ని తెలిపే విధంగా కలియుగ పాండవులు నుంచి సైంధవ్ వరకు తన సినీ ప్రయాణాన్ని తెలుపుతూ ఓ షో నిర్వహించారు.ఈ ఈవెంట్ కి చిరంజీవి , రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్రయూనిట్ ఈ ఈవెంట్ కి విచ్చేశారు.
వెంకీ 75 ఈవెంట్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ యాప్ ఈ విన్ కొనుక్కోవడంతో ఈవెంట్ ని బయట టెలికాస్ట్ చేయలేదు. అయితే ఈ ఈవెంట్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ ఈవెంట్లో కామెడీ స్కిట్స్, డ్యాన్సులు, పాటలు, ఎమోషనల్ స్పీచ్ లు, గేమ్స్.. ఇలా అన్ని కలగలిపి ఉన్నాయి. ప్రస్తుతం వెంకీ 75 ఈవెంట్ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.‘వెంకీ 75 కలియుగ పాండవులు – సైంధవ్’ పేరిట డిసెంబర్ 27న భారీగా జరిగిన ఈ ఈవెంట్ నేటి సాయంత్రం ఆరు గంటలకు ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. “వెంకీ మామ మాస్ జాతర అంటున్నా. ఈవెంట్ అదిరిపోద్ది అంటున్నా.. ఇచ్చి పడేస్తున్నాం అంటున్నా. ఐకానిక్ ల్యాండ్మార్క్ ఈవెంట్ వెంకీ 75 డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్ అవుతుంది” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…