Udayabhanu : సెలబ్రిటీలు చాలా బాధ్యాయుతంగా ఉండాలి. వారు ఏదైన స్టేట్మెంట్ పాస్ చేసారంటే దానిలో కచ్చితత్వం తప్పక ఉండితీరాలి. ఏది పడితే అది మాట్లాడితే జనాలలోకి రాంగ్గా వెళుతుంది. తాజాగా ఉదయభాను పాలకూర తింటే కిడ్నీలు వస్తాయనే విషయంలో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి విమర్శల పాలైంది. వివరాలలోకి వెళితే ఒకప్పుడు యాంకర్గా అదరగొట్టిన ఉదయభాను పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్లో ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తుంది. అయితే రీసెంట్గా ఉదయభాను యూట్యూబ్లో ఒక రెసిపీకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె చేసిన కామెంట్స్ ట్రోలింగ్కి దారి తీసాయి.
ఆకు కూరలను శుభ్రం చేయడం గురించి ఉదయ భాను ఒక వీడియో చేయగా ఆ వీడియోలో కిడ్నీలో రాళ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. గోంగూరను కడుగుతున్నప్పుడు వచ్చిన ఇసుకను చూపించిన ఉదయభాను.. ఆకు కూరలను రెండుమూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. అలానే పాలకూర భూమికి చాలా దగ్గరగా పెరుగుతుందని, దాంతో ఆకులకి ఎక్కవు ఇసుక అంటుకొని మనం సరిగ్గా కడగని పక్షంలో అది మన కడుపులోకి వెళ్లిపోయి కిడ్నీలో రాళ్లు వస్తాయని ఉదయభాను వివరించారు. ఇది చూసిన ఒక డాక్టర్.. ఉదయభాను వీడియోలోని ఈ చిన్న క్లిప్ను బయటికి తీసి ఇది తప్పని చెబుతూ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఎక్స్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. తెలియకపోతే తెలియనట్టు ఉండాలని.. ఏదిపడితే అది చెబితే ఎలా అంటూ ఉదయభానుని తిట్టిపోస్తున్నారు. పాలకూరలో 100 గ్రాములు ఆగ్జలేట్ ఉంటుందట. అలానే టమాటాల్లో 50 మిల్లీ గ్రాముల ఆగ్జలేట్స్ ఉంటాయట. ఈ రెండూ కలిపితే ఆగ్జలేట్స్ మరింత ఎక్కువైపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయట. అయితే, పాలకూరను పచ్చిగా తీసుకున్నప్పుడే ఈ సమస్య వస్తుందని చాలా దోసెల్లో, సలాడ్స్లో పచ్చిగా తింటారు కాబట్టే కిడ్నీలో స్టోన్ సమస్య వస్తుందని ఓ సందర్భంలో మంతెన సత్యనారాయణ చెప్పారు. వేడిచేసినప్పుడు ఆగ్జలేట్స్ 85 నుంచి 90 శాతం తగ్గిపోతాయి కాబట్టి పాలకూరను వండుకొని తిన్నప్పుడు ఎలాంటి సమస్యాలేదని మంతెన స్పష్టం చేశారు. అయితే ఉదయ భాను చెప్పింది పూర్తిగా అసత్యం కాబట్టి ఆమెని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…