Udayabhanu : సెలబ్రిటీలు చాలా బాధ్యాయుతంగా ఉండాలి. వారు ఏదైన స్టేట్మెంట్ పాస్ చేసారంటే దానిలో కచ్చితత్వం తప్పక ఉండితీరాలి. ఏది పడితే అది మాట్లాడితే జనాలలోకి రాంగ్గా వెళుతుంది. తాజాగా ఉదయభాను పాలకూర తింటే కిడ్నీలు వస్తాయనే విషయంలో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి విమర్శల పాలైంది. వివరాలలోకి వెళితే ఒకప్పుడు యాంకర్గా అదరగొట్టిన ఉదయభాను పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్లో ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తుంది. అయితే రీసెంట్గా ఉదయభాను యూట్యూబ్లో ఒక రెసిపీకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె చేసిన కామెంట్స్ ట్రోలింగ్కి దారి తీసాయి.
ఆకు కూరలను శుభ్రం చేయడం గురించి ఉదయ భాను ఒక వీడియో చేయగా ఆ వీడియోలో కిడ్నీలో రాళ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. గోంగూరను కడుగుతున్నప్పుడు వచ్చిన ఇసుకను చూపించిన ఉదయభాను.. ఆకు కూరలను రెండుమూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. అలానే పాలకూర భూమికి చాలా దగ్గరగా పెరుగుతుందని, దాంతో ఆకులకి ఎక్కవు ఇసుక అంటుకొని మనం సరిగ్గా కడగని పక్షంలో అది మన కడుపులోకి వెళ్లిపోయి కిడ్నీలో రాళ్లు వస్తాయని ఉదయభాను వివరించారు. ఇది చూసిన ఒక డాక్టర్.. ఉదయభాను వీడియోలోని ఈ చిన్న క్లిప్ను బయటికి తీసి ఇది తప్పని చెబుతూ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఎక్స్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. తెలియకపోతే తెలియనట్టు ఉండాలని.. ఏదిపడితే అది చెబితే ఎలా అంటూ ఉదయభానుని తిట్టిపోస్తున్నారు. పాలకూరలో 100 గ్రాములు ఆగ్జలేట్ ఉంటుందట. అలానే టమాటాల్లో 50 మిల్లీ గ్రాముల ఆగ్జలేట్స్ ఉంటాయట. ఈ రెండూ కలిపితే ఆగ్జలేట్స్ మరింత ఎక్కువైపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయట. అయితే, పాలకూరను పచ్చిగా తీసుకున్నప్పుడే ఈ సమస్య వస్తుందని చాలా దోసెల్లో, సలాడ్స్లో పచ్చిగా తింటారు కాబట్టే కిడ్నీలో స్టోన్ సమస్య వస్తుందని ఓ సందర్భంలో మంతెన సత్యనారాయణ చెప్పారు. వేడిచేసినప్పుడు ఆగ్జలేట్స్ 85 నుంచి 90 శాతం తగ్గిపోతాయి కాబట్టి పాలకూరను వండుకొని తిన్నప్పుడు ఎలాంటి సమస్యాలేదని మంతెన స్పష్టం చేశారు. అయితే ఉదయ భాను చెప్పింది పూర్తిగా అసత్యం కాబట్టి ఆమెని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…