Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషలలో నటించి వైవిధ్యమైన నటనతో అశేష ప్రేక్షకాదరణ పొందిన అందాల ముద్దుగుమ్మ త్రిష. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిన కూడా తమిళంలో మాత్రం మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. రీసెంట్గా త్రిష లియో అనే చిత్రంలో విజయ్ సరసన నటించింది. ఇందులో త్రిష నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇక కీలక పాత్రలో కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటించారు. అయితే చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో మన్సూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్రూమ్ సన్నివేశం ఉంటుందని అనుకున్నాను. ఆమెను చేతులతో ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకెళ్లవచ్చని భావించాను. కాని కాశ్మీర్ షెడ్యూల్లో సెట్స్లో అసలు త్రిషను నాకు చూపించనే లేదు అంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ తన చేష్టలతో అందరికి చిరాకు తెప్పించాడు. మన్సూర్పై ఇప్పుడు ప్రతి ఒక్కరు దుమ్మెత్తిపోశారు. అవమానకరంగా, స్త్రీద్వేషంతో కూడిన అసహ్యకరమైన మాటలుగా, జుగుప్సాకరంగా ఉన్నాయి అంటూ అతడి వ్యాఖ్యలపై త్రిష కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అతని లాంటి దారుణమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్ను ఇంతకాలం పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని, నా మిగిలిన సినిమా కెరీర్లో కూడా అతనితో నటించకుండా చూసుకుంటాను. ఇలాంటి నీచమైన వ్యక్తి మగజాతికి మచ్చ తెచ్చేలా ఉన్నాడంటూ త్రిష తెలియజేసింది. మన్సూర్పై చిన్మయి శ్రీపాద కూడా దారుణంగా మండిపడింది. ఇలాంటి మనుషులు ఎప్పుడూ ఇలానే మాట్లాడుతుంటారు.. డబ్బు, అధికారం ఇలాంటివి చూసుకునే ఇలా నీచంగా అసహ్యంగా మాట్లాడతారంటూ మండిపడింది. మలయాళ నటి మాళవిక మోహన్, దర్శకుడు లోకేష్ కానగరాజ్వంటి ప్రముఖులు కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…