Swayam Krushi Movie : డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది స్వయంకృషి సినిమా. అప్పటివరకు మాస్ ఇమేజ్లో తడిసిముద్దవుతున్న చిరంజీవిలోని మరో యాంగిల్ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఈ చిత్రం. స్వయంకృషితో చిరంజీవిలోని మరో కోణాన్ని చూపించిన విశ్వనాథ్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. 1987లో ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయంకృషి సినిమా విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించగా, బాల నటుడు మాస్టర్ అర్జున్ మరో ప్రధాన పాత్రలో కనిపించాడు.
ఖైదీ, కొండవీటి రాజా, అడవిదొంగ, పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలతో టాప్ పొజిషన్కి ఎదుగుతున్న చిరంజీవి కమర్షియల్ సర్కిల్ నుంచి బయటకు వచ్చి స్వయంకృషి అనే సినిమా చేశాడు. ఈ సినిమా చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా.. ప్రయోగాలతో కూడా చిరంజీవి సక్సెస్ కొట్టగలరని నిరూపించింది. ఇందులో చిరంజీవి పాత్రను గొప్పగా చెక్కారు కళా తపస్వి కె విశ్వనాథ్. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షూటింగ్ బ్రేక్ సమయంలో విశ్వనాథ్ గారు భోజనం చేస్తూ ఉంటే చిరంజీవి మాత్రం పడుకున్నారట. దాంతో చిరంజీవి భోజనం చేశారా లేదా అని విశ్వనాథ్ గారు సిబ్బందిని అడగగా, ఆయన మధ్యాహ్నం భోజనం చేయరని డైట్ లో ఉన్నారని చెప్పారు.
అప్పుడు విశ్వనాథ్ స్వయంగా ప్లేట్ లో అన్నం వేసి అందులో పెరుగు వేసి తానే కలిపి చిరంజీవికి ఇవ్వండని పంపించారు. అయితే చిరుని నిద్ర లేపే సాహసం ఎవరు చేయలేదు. కానీ అదే సమయంలో అక్కడ గుడి గంట మోగగా, ఆ శబ్దానికి చిరు లేచి కూర్చున్నారు. ఇక అప్పుడే విశ్వనాథ్ గారు చిరంజీవి అన్నం తిను అని చెప్పడం తో మహా ప్రసాదం అని తిన్నారు. ఈ విషయాన్ని చిరు చాలా ఇంటర్వ్యూ లలో చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ గారంటే చిరంజీవికి ఎంతో అభిమానంతో పాటు ప్రేమ కూడా ఉండేది. ఆ మధ్య ఓ సారి చిరంజీవి తన సతీమణితో విశ్వనాథ్ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి వచ్చారు. ఇక విశ్వనాథ్ మృతి పట్ల చిరు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…