Swayam Krushi Movie : డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది స్వయంకృషి సినిమా. అప్పటివరకు మాస్ ఇమేజ్లో తడిసిముద్దవుతున్న చిరంజీవిలోని మరో యాంగిల్ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఈ చిత్రం. స్వయంకృషితో చిరంజీవిలోని మరో కోణాన్ని చూపించిన విశ్వనాథ్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. 1987లో ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయంకృషి సినిమా విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించగా, బాల నటుడు మాస్టర్ అర్జున్ మరో ప్రధాన పాత్రలో కనిపించాడు.
ఖైదీ, కొండవీటి రాజా, అడవిదొంగ, పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలతో టాప్ పొజిషన్కి ఎదుగుతున్న చిరంజీవి కమర్షియల్ సర్కిల్ నుంచి బయటకు వచ్చి స్వయంకృషి అనే సినిమా చేశాడు. ఈ సినిమా చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా.. ప్రయోగాలతో కూడా చిరంజీవి సక్సెస్ కొట్టగలరని నిరూపించింది. ఇందులో చిరంజీవి పాత్రను గొప్పగా చెక్కారు కళా తపస్వి కె విశ్వనాథ్. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షూటింగ్ బ్రేక్ సమయంలో విశ్వనాథ్ గారు భోజనం చేస్తూ ఉంటే చిరంజీవి మాత్రం పడుకున్నారట. దాంతో చిరంజీవి భోజనం చేశారా లేదా అని విశ్వనాథ్ గారు సిబ్బందిని అడగగా, ఆయన మధ్యాహ్నం భోజనం చేయరని డైట్ లో ఉన్నారని చెప్పారు.
అప్పుడు విశ్వనాథ్ స్వయంగా ప్లేట్ లో అన్నం వేసి అందులో పెరుగు వేసి తానే కలిపి చిరంజీవికి ఇవ్వండని పంపించారు. అయితే చిరుని నిద్ర లేపే సాహసం ఎవరు చేయలేదు. కానీ అదే సమయంలో అక్కడ గుడి గంట మోగగా, ఆ శబ్దానికి చిరు లేచి కూర్చున్నారు. ఇక అప్పుడే విశ్వనాథ్ గారు చిరంజీవి అన్నం తిను అని చెప్పడం తో మహా ప్రసాదం అని తిన్నారు. ఈ విషయాన్ని చిరు చాలా ఇంటర్వ్యూ లలో చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ గారంటే చిరంజీవికి ఎంతో అభిమానంతో పాటు ప్రేమ కూడా ఉండేది. ఆ మధ్య ఓ సారి చిరంజీవి తన సతీమణితో విశ్వనాథ్ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి వచ్చారు. ఇక విశ్వనాథ్ మృతి పట్ల చిరు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…