Swayam Krushi Movie : డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది స్వయంకృషి సినిమా. అప్పటివరకు మాస్ ఇమేజ్లో తడిసిముద్దవుతున్న చిరంజీవిలోని మరో యాంగిల్ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఈ చిత్రం. స్వయంకృషితో చిరంజీవిలోని మరో కోణాన్ని చూపించిన విశ్వనాథ్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. 1987లో ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయంకృషి సినిమా విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించగా, బాల నటుడు మాస్టర్ అర్జున్ మరో ప్రధాన పాత్రలో కనిపించాడు.
ఖైదీ, కొండవీటి రాజా, అడవిదొంగ, పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలతో టాప్ పొజిషన్కి ఎదుగుతున్న చిరంజీవి కమర్షియల్ సర్కిల్ నుంచి బయటకు వచ్చి స్వయంకృషి అనే సినిమా చేశాడు. ఈ సినిమా చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా.. ప్రయోగాలతో కూడా చిరంజీవి సక్సెస్ కొట్టగలరని నిరూపించింది. ఇందులో చిరంజీవి పాత్రను గొప్పగా చెక్కారు కళా తపస్వి కె విశ్వనాథ్. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షూటింగ్ బ్రేక్ సమయంలో విశ్వనాథ్ గారు భోజనం చేస్తూ ఉంటే చిరంజీవి మాత్రం పడుకున్నారట. దాంతో చిరంజీవి భోజనం చేశారా లేదా అని విశ్వనాథ్ గారు సిబ్బందిని అడగగా, ఆయన మధ్యాహ్నం భోజనం చేయరని డైట్ లో ఉన్నారని చెప్పారు.
అప్పుడు విశ్వనాథ్ స్వయంగా ప్లేట్ లో అన్నం వేసి అందులో పెరుగు వేసి తానే కలిపి చిరంజీవికి ఇవ్వండని పంపించారు. అయితే చిరుని నిద్ర లేపే సాహసం ఎవరు చేయలేదు. కానీ అదే సమయంలో అక్కడ గుడి గంట మోగగా, ఆ శబ్దానికి చిరు లేచి కూర్చున్నారు. ఇక అప్పుడే విశ్వనాథ్ గారు చిరంజీవి అన్నం తిను అని చెప్పడం తో మహా ప్రసాదం అని తిన్నారు. ఈ విషయాన్ని చిరు చాలా ఇంటర్వ్యూ లలో చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ గారంటే చిరంజీవికి ఎంతో అభిమానంతో పాటు ప్రేమ కూడా ఉండేది. ఆ మధ్య ఓ సారి చిరంజీవి తన సతీమణితో విశ్వనాథ్ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి వచ్చారు. ఇక విశ్వనాథ్ మృతి పట్ల చిరు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…