బుల్లితెర రారాణిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందిన సుమ ఇటీవలి కాలంలో తెగ విమర్శల బారిన పడుతుంది. రీసెంట్గా కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ అందరికి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ చెప్పింది. అయితే ఆ చెప్పడం లో కొంచెం తేడా కొట్టింది, దానికి ఎన్టీఆర్ చాల సీరియస్ అయ్యాడు. తన సొంత కుటుంబం గురించి కానీ, పర్సనల్ కానీ పట్టించుకోని అభిమానులు ఇప్పుడు ఎన్టీఆర్ 30 గురించి చాల ఆతృతగా, ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు అని చెప్పేసరికి ఎన్టీఆర్ కి ఎక్కడలేని కోపం వచ్చింది. సుమ వచ్చి మైక్ ఎన్టీఆర్ కి ఇవ్వగానే, వాళ్ళు అడిగారా లేదో కానీ, నువ్వే అన్నీ చెప్పేట్టు వున్నావు అని ఎన్టీఆర్ సుమకి చిన్నపాటి పంచ్ ఇచ్చాడు.దీంతో సుమ ఇది వినీ విననట్టుగా ఉండిపోయింది.
ఒకప్పుడు సుమ యాంకరింగ్కి వంక పెట్టేవాళ్లే లేకుండా పోయారు. కాని ఇప్పుడలా కాదు. గత 1-2 ఏళ్ల నుంచి కాస్త శ్రుతి తప్పుతోంది. ఒకప్పుడు ఈవెంట్ అంటే సుమ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడేది. ఈ మధ్య కాలంలో మాత్రం చిరంజీవి, రాజమౌళి లాంటి స్టార్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయి విమర్శల బారిన పడుతుంది. కొద్ది రోజుల ముందు కొన్నాళ్ల ముందు రాజమౌళి పాల్గొన్న ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ‘SSMB29’గురించి మాట్లాడి వారి ఆగ్రహానికి గురైంది.
ఇక ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరు స్పీచ్ లో సుమ కల్పించుకుంది. ఇక కొన్నిరోజుల ముందు ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్ లోనూ రచ్చ రవి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే.. సుమ దాన్ని కాస్త పక్కదారి పట్టించేలా చేయడంతో కొంత విమర్శల బారిన పడిందనే చెప్పాలి. వరుసగా సుమ ఇలా వివాదాలలో చిక్కుకోవడం వలన యాంకరింగ్ శృతి తప్పుతుందని పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇలా ఎన్ని జరిగినా సరే సుమ అంటే పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు అందరు గౌరవిస్తూనే ఉంటారు. ఎక్కడ వల్గారిటీ లేకుండా కార్యక్రమాన్ని సజావుగా నడిపించడంలో సుమని మించిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…