సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్త్రీ’ మూవీ బాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘స్త్రీ2’ మూవీ ఈ యేడాది ఆగష్టు 15న విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించింది. తొలి రోజు ఈ సినిమా రూ. 55.40 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా 9.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తొలి రోజు ఈ సినిమా 64.80 కోట్ల నెట్ వసూళ్లతో బాలీవుడ్ లో సంచలనం రేపింది.
శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావ్ రెమ్యునరేషన్లు, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికంతోపాటు ఈ ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ మూవీకి భారీ ఆదరణ ఉండటంతో సుమారుగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.ఈ చిత్రం హిందీ సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు షారుక్ నటించిన జవాన్ సినిమా సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డును, యానిమల్, హృతిక్ రోషన్ ఫైటర్ లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. హిందీ సినిమా రంగంలో ఇప్పటి వరకు జవాన్ చిత్రం 584 కోట్ల రూపాయలతో అత్యదిక వసూళ్లు సాధించిన సినిమాగా ఘనతను సాధించింది. తాజాగా స్త్రీ 2 చిత్రం 586 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
తొలి భాగం కంటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది స్త్రీ2. ఈ సీక్వెల్లో కొత్తగా సర్కటా అనే దెయ్యాన్ని చూపించారు. నవ్విస్తూనే భయపెడుతున్న ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఇక థియేటర్లలో ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్నా.. స్త్రీ2 మూవీ త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లోకి రానుందని భావిస్తున్నారు. అయితే ఫ్రీగా కాకుండా రెంట్ విధానంలో మూవీ వచ్చే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…