Siri Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 5లో చిరుతలా గేమ్ ఆడిన లేడీ కంటెస్టెంట్ సిరి టాప్ 5 కంటెస్టెంట్స్లో ముందుగా ఎలిమినేట్ అయింది. అందరూ అనుకున్నట్టుగానే టాప్ 5కి చేరిన సిరి హనుమంత్ ఐదో స్థానంతో సరి పెట్టుకుంది. రష్మిక, దేవి శ్రీ ప్రసాద్లను బిగ్ బాస్ హౌస్లోకి నాగార్జున పంపించారు. టాప్ 5 కంటెస్టెంట్స్ ఫొటోలతో హౌస్లోకి ఐదు డ్రోన్ కెమెరాలు పంపించారు. అందులో నుంచి ఎవరి ఫొటో ఉన్న డ్రోన్ కెమెరా బయటకు వెళ్తే వాళ్లు ఎలిమినేట్ అయినట్టని చెప్పాడు దేవి శ్రీప్రసాద్.
అయితే గాల్లో నుంచి సిరి ఫొటో ఉన్న డ్రోన్ ఎగిరిపోవడంతో సిరిని తీసుకుని బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చేశారు. 19 మందితో పోరాడి.. టాప్ 5కి రావడం చాలా హ్యాపీగా ఉంది.. ఇది నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు అని చెప్పింది. దీంతో హౌస్లో ఎవర్నైనా సాధించావా? అని నాగార్జున అడగడంతో సిరి తెగ సిగ్గు పడిపోయింది.. నేను సీరియస్గానే అడుగుతున్నా చెప్పమ్మా.. అని నాగ్ అడగడంతో.. ఇంకెవరు సార్, షణ్ముఖ్.. అని సిగ్గులేకుండా చెప్పింది.
గొడవైనా, ప్రేమైనా తగ్గేదేలే అంటూ రెచ్చిపోయి మరీ ఆడింది ఈ పటాకా. కాకపోతే ఎక్కువగా ప్రేమను షణ్ముఖ్కు, కోపాన్ని సన్నీకి పంచిపెట్టింది. యూట్యూబ్లో వెబ్ సిరీస్తోపాటు సీరియళ్లలోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సిరికి వారానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల రూపాయల మేర ఇస్తామని ముందుగానే డీల్ కుదుర్చుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే సిరి పదిహేను వారాలకు గాను సుమారుగా రూ.25 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…