ఇటీవల సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ చిన్నప్పటి పిక్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. గుండులో, బూరె బుగ్గలతో అమాయకంగా.. కనిపిస్తున్న ఈ చిన్నారిని చూసి అభిమానులు మైమరచిపోతున్నాయి. మరి ఆమె ఎవరా అనే కదా మీ డౌట్.. సమీరా రెడ్డి. నరసింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన సమీరా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆశోక్ చిత్రంలో నటించి సక్సెస్ అందుకుంది. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఆమెకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె.. పెళ్లి తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న సమీరా.. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు.. కెరీర్ కు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తుంది.
తాను ప్రెగ్నేన్సీ సమయంలో లావుగా మారడంతో ఎన్నో ట్రోల్ ఎదుర్కొన్నానని.. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా శ్రమించానని కూడా చెప్పుకొచ్చింది. అలానే 1998లో మహేష్ బాబు సినిమా కోసం తొలిసారిగా తాను ఆడిషన్ కు వెళ్లి.. వాళ్లు ఇచ్చిన టాస్క్ సరిగా చేయక కన్నీళ్లతో ఇంటికి వచ్చినట్లు చెప్పుకొచ్చింది సమీరా. ఛాన్స్ అలా మిస్ కావడంతో అప్పటి వరకు తాను చేస్తున్న జాబ్ కంటిన్యూ చేయాలని అనుకుందట సమీరా. ఓ ప్రైవేట్ ఆల్చమ్ లో అవకాశాలు రావడం. ఆ తర్వాత వెండితెరపై వెలగడం చక చకా జరిగిపోయాయి. అంతేకాకుండా ఆడిషన్ కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసుకున్నారు. సమీరా వెళ్లింది రాజకుమారుడు సినిమా కోసమే అని తెలుస్తుంది. సమీరా 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…