ఇటీవల సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ చిన్నప్పటి పిక్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. గుండులో, బూరె బుగ్గలతో అమాయకంగా.. కనిపిస్తున్న ఈ చిన్నారిని చూసి అభిమానులు మైమరచిపోతున్నాయి. మరి ఆమె ఎవరా అనే కదా మీ డౌట్.. సమీరా రెడ్డి. నరసింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన సమీరా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆశోక్ చిత్రంలో నటించి సక్సెస్ అందుకుంది. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఆమెకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె.. పెళ్లి తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న సమీరా.. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు.. కెరీర్ కు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తుంది.
తాను ప్రెగ్నేన్సీ సమయంలో లావుగా మారడంతో ఎన్నో ట్రోల్ ఎదుర్కొన్నానని.. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా శ్రమించానని కూడా చెప్పుకొచ్చింది. అలానే 1998లో మహేష్ బాబు సినిమా కోసం తొలిసారిగా తాను ఆడిషన్ కు వెళ్లి.. వాళ్లు ఇచ్చిన టాస్క్ సరిగా చేయక కన్నీళ్లతో ఇంటికి వచ్చినట్లు చెప్పుకొచ్చింది సమీరా. ఛాన్స్ అలా మిస్ కావడంతో అప్పటి వరకు తాను చేస్తున్న జాబ్ కంటిన్యూ చేయాలని అనుకుందట సమీరా. ఓ ప్రైవేట్ ఆల్చమ్ లో అవకాశాలు రావడం. ఆ తర్వాత వెండితెరపై వెలగడం చక చకా జరిగిపోయాయి. అంతేకాకుండా ఆడిషన్ కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసుకున్నారు. సమీరా వెళ్లింది రాజకుమారుడు సినిమా కోసమే అని తెలుస్తుంది. సమీరా 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…