Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య థియేటర్స్ లో ఎంత సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో సంక్రాంతి వేదికైంది. చిత్రంలో వింటేజ్ చిరును చూసి అభిమానులు మురిపోయారు. మెగాస్టార్ యాక్షన్, కిక్కిచ్చే డ్యాన్సులు, విజిల్స్ వేయించే ఫైట్స్ ఇలా సినిమా మొత్తం ఒక మాస్ ప్యాకేజితో నిండిపోయింది. చిరు మాస్ యాక్షన్కు రవితేజ క్రేజ్ తోడవడంతో బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య విజయభేరి మొగించింది అని చెప్పాలి.
ప్రస్తుతం స్టడీగా కలెక్షన్స్ కొనసాగుతున్నాయి. వాల్తేరు వీరయ్య ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. దాదాపు అన్నీ ఏరియాల్లో మంచి వసూళ్లను సాధించి పెట్టిందీ చిత్రం. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్లో విడుదలైంది. ఫస్ట్ డే మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో టూ మిలియన్ మార్కును అధిగమించింది దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం.
ఇంతకు ముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి ఇతర సినిమాలు చూస్తే సైరా, ఖైదీ నెంబర్ 150లుగా ఉన్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా అక్కడ 2.5 మిలియన్ డాలర్స్ను ఇప్పటి వరకు అందుకుంది.. రీసెంట్ గా ఈ చిత్రం 25 రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫిబ్రవరి 27 నుండి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, ఈ నెల 27 నుండి ఓటీటీలో రచ్చ షురూ కానుంది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…