Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ అమ్మడు మయోసైటిస్ వలన సినిమాలకి దూరం కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. రీసెంట్గా సమంత సమంత తన ఇన్స్టాగ్రామ్లో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ అని సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో అభిమాని అడిగిన ‘పెళ్లి’ ప్రశ్నకు ఒక హిలేరియస్ ఆన్సర్ ఇచ్చారు. ఈ సమాధానాన్ని బట్టి ఇక ఆమె పెళ్లిచేసుకోరేమో అనే అనుమానం కలుగుతోంది. ఒక అభిమాని రెండో పెళ్లి గురించి ప్రశ్నించాడు. “మీరు రెండో పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా..?” అని ప్రశ్నించాడు. దీనికి సమంత బదులిస్తూ.. డివోర్స్ కి సంబంధించిన ఒక సర్వే స్టాటిస్టిక్స్ ని షేర్ చేశారు.
ఆ స్టాటిస్టిక్స్ ఏంటంటే.. 2023 సర్వే ప్రకారం మెుదటి పెళ్ళికి సంబంధించిన డివోర్స్ కేసులు శాతం 50% ఉందట. అదే రెండో, మూడో పెళ్ళికి సంబంధించిన డివోర్స్ కేసులు శాతం 67%, 73% ఉందట. ఇక ఈ స్టాటిస్టిక్స్ బట్టి రెండో పెళ్లి పై ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది తప్పు నిర్ణయం అని సమంత చెప్పుకొచ్చింది. ఈ ఆన్సర్ బట్టి ఆమె ఇన్డైరెక్ట్ గా రెండో పెళ్లి చేసుకోను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.
2023 వరకు చూసుకుంటే మొదటిసారి పెళ్లిచేసుకున్న వారిలో విడాకులు తీసుకుంటున్న వారి రేటు సుమారు 50 శాతం వరకు ఉంది. ఇక రెండోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 67 శాతంగా ఉంది. అలాగే మూడోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 73 శాతంగా ఉంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ ఈ రేటింగ్ ఇలాగే ఉందట. సమంత ఈ లెక్కలతో సమాధానం ఇవ్వడాన్ని బట్టి.. ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా విడాకులు కామన్.. అలాంటప్పుడు ఇంక రెండో పెళ్లి ఎందుకయ్యా? అని చెప్పినట్టుంది. చూస్తుంటే సమంత రెండో పెళ్లికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే, అక్కినేని నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమా సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. కాని అనూహ్యంగా 2021 అక్టోబర్లో విడిపోయారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…