Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ అమ్మడు మయోసైటిస్ వలన సినిమాలకి దూరం కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. రీసెంట్గా సమంత సమంత తన ఇన్స్టాగ్రామ్లో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ అని సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో అభిమాని అడిగిన ‘పెళ్లి’ ప్రశ్నకు ఒక హిలేరియస్ ఆన్సర్ ఇచ్చారు. ఈ సమాధానాన్ని బట్టి ఇక ఆమె పెళ్లిచేసుకోరేమో అనే అనుమానం కలుగుతోంది. ఒక అభిమాని రెండో పెళ్లి గురించి ప్రశ్నించాడు. “మీరు రెండో పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా..?” అని ప్రశ్నించాడు. దీనికి సమంత బదులిస్తూ.. డివోర్స్ కి సంబంధించిన ఒక సర్వే స్టాటిస్టిక్స్ ని షేర్ చేశారు.
ఆ స్టాటిస్టిక్స్ ఏంటంటే.. 2023 సర్వే ప్రకారం మెుదటి పెళ్ళికి సంబంధించిన డివోర్స్ కేసులు శాతం 50% ఉందట. అదే రెండో, మూడో పెళ్ళికి సంబంధించిన డివోర్స్ కేసులు శాతం 67%, 73% ఉందట. ఇక ఈ స్టాటిస్టిక్స్ బట్టి రెండో పెళ్లి పై ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది తప్పు నిర్ణయం అని సమంత చెప్పుకొచ్చింది. ఈ ఆన్సర్ బట్టి ఆమె ఇన్డైరెక్ట్ గా రెండో పెళ్లి చేసుకోను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.
2023 వరకు చూసుకుంటే మొదటిసారి పెళ్లిచేసుకున్న వారిలో విడాకులు తీసుకుంటున్న వారి రేటు సుమారు 50 శాతం వరకు ఉంది. ఇక రెండోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 67 శాతంగా ఉంది. అలాగే మూడోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 73 శాతంగా ఉంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ ఈ రేటింగ్ ఇలాగే ఉందట. సమంత ఈ లెక్కలతో సమాధానం ఇవ్వడాన్ని బట్టి.. ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా విడాకులు కామన్.. అలాంటప్పుడు ఇంక రెండో పెళ్లి ఎందుకయ్యా? అని చెప్పినట్టుంది. చూస్తుంటే సమంత రెండో పెళ్లికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే, అక్కినేని నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమా సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. కాని అనూహ్యంగా 2021 అక్టోబర్లో విడిపోయారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…