Sai Pallavi : లేడి పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోలని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవి ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించేసింది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సాయి పల్లవి ఇటీవలి కాలంలో చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ భామ. గతకొంతకాలంగా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో ఈ సాయి పల్లవి చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ భామ.
తెలుగులో ఈ చిన్నది చివరిగా రానా హీరోగా నటించిన విరాటపర్వం సినిమాలో కనిపించింది. తమిళ్ లో గార్గి సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఆతర్వాత సాయి పల్లవి సైలెంట్ అయ్యింది. ఆమె నుంచి కొత్త సినిమా ఏది రాకపోవడంతో ఈ అమ్మడు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని అందరు అనుకున్నారు. మరి కొందరు ఈ అమ్మడు సినిమాలు మానేసిందని, డాక్టర్స్ గా సెటిల్ కాబోతుందని వార్తలు వచ్చాయి. కొంతమంది ఏకంగా పెళ్లి చేసుకోనుందని కూడా ప్రచారం చేశారు. అయితే శివ కార్తికేయన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది సాయి పల్లవి.
తెలుగులో ఎవరితో సాయిపల్లవి సినిమా చేస్తుందని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతుంది.ఈ సినిమాల్లో సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ముందుగా ఈ పాత్ర కోసం జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి గ్లామరస్ బ్యూటీలను అనుకున్నారని ..కధ పరంగా చాలా డెప్త్ ఉండడంతో సాయి పల్లవి లాంటి కథానాయికని తీసుకుంటే సినిమాకి డెప్త్ వస్తుందని ఆమెని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ త్వరలోనే రానుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…