Sai Dharam Tej : మెగా పవర్ స్టార్ సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ సాయి ధరమ్ తేజ్ రీఎంట్రీ తర్వాత విరూపాక్ష అనే సినిమా చేశాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో చిత్రం చేశాడు. ఈ చిత్రంకి మంచి ఆదరణ లభించింది.అయితే తేజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతోంది. పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న తేజ్… ప్రస్తుతం ‘గాంజా శంకర్’ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఇదే కాక పలు సినిమాలని లైన్లో పెట్టాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తేజ్.. తాజాగా తన అభిమానులతో తాజాగా చిట్ చాట్ చేశాడు.
చిట్ చాట్లో భాగంగా ఓ నెటిజెన్.. మీ సినిమాలలో మీకు చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్రలు ఏమిటని అడగగా, దీనికి సమాధానంగా చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాల్లోని పాత్రలు తనకుఎంతో సంతృప్తిని ఇచ్చాయని తెలియజేశాడు. అయితే రిపబ్లిక్ పేరు తేజు తప్పుగా టైప్ చేయడంతో ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. అది రిలబ్లిక్ కాదురా రిపబ్లిక్… ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా? అని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై తేజ్ స్పందిస్తూ… తమ స్కూల్లో తమకు గౌరవం కూడా నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించారా? అని ప్రశ్నించాడు. నేర్పించకపోతే నేర్చుకో అంటూ గట్టిగానే ఇచ్చిపడేసాడు. అయితే అప్పుడు నెటిజన్.. నన్ను క్షమించు అన్నా… నీవు రిప్లై ఇవ్వవనే అలా పెట్టాను అని కామెంట్ చేశాడు.
మీ పెళ్లి ఎప్పుడు బ్రో? అని ఓ నెటిజన్ అడగ్గా, నీ వివాహం అయిన వెంటనే అని స్టన్నింగ్ సమాధానం ఇచ్చారు. చిన్న మామ పవన్ కల్యాణ్ తో కలిసి సినిమా చేశారు? పెద్దమామ(చిరంజీవి)తో సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడగగా, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలియజేశాడు.మరో నెటిజన్ అర్జెంట్ గా రూ. 10 లక్షలు కావాలని అడిగాడు. అయితే, ఈ ప్రశ్నకు బ్రహ్మానందం నవ్వుతూ ఉండే జిఫ్ ఇమేజ్ ని సమాధానంగా ఇచ్చాడు. మరో నెటిజన్ రెగ్యులర్ సినిమాలు కాకుండా విరూపాక్ష లాంటి సినిమాలు ట్రై చేయమని అన్నాడు. తాను అన్ని రకాల సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…