Roshini : తెలుగు తెరపై సందడి చేసి ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న చాలా మంది భామలు ఉన్నారు. వీరిలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని వెండితెరకి దూరమయ్యారు. అయితే కొందరు భామలు మాత్రం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆనాటి అందాల తారలు కొందరు ఇటు తెలుగులో బ్లాక్బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ తక్కువ సినిమాలకే పరిమితమయ్యారు. వారిలో ఒకరు రాధిక సదనా ఉరఫ్ రోషిణి. ఈ పేరు చెబితే గుర్తుపెట్టుకోవడం కష్టమే, కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా అంటే మాత్రం వెంటనే గుర్తొస్తుంది.
1997లో విడుదలైన తమిళ కామెడీ చిత్రం శిష్యాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది రోషిణి. ఇక అదే ఏడాది తెలుగులో విడుదలైన మాస్టర్ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. మాస్టర్ పాత్రలో నటించిన చిరంజీవికి ఫ్లాష్ బ్యాక్ లో జోడీగా అలరించింది. ప్రీతీరావు పాత్రలో ఆకట్టుకోవడంతో ఆ తర్వాత పవిత్ర ప్రేమ, శుభలేఖ వంటి సినిమాలలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అయితే రోషిణి నటించిన చిత్రాలేవీ పెద్దగా హిట్ కాకపోవడంతో ఆఫర్లు కూడా తగ్గాయి. రెండేండ్లలో తెలుగుతోపాటు తమిళం, కన్నడలోనూ నటించింది.
రోషిణి హీరోయిన్లు నగ్మా, జ్యోతికల చెల్లెలు కాగా, ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివసిస్తోంది. 25 ఏండ్లు సినిమాలకు దూరమైన రోషిణి ఇప్పుడు కాస్తా లావైపోయారు. గుర్తుపట్టడం కష్టంగానే ఉంది. ఈక్రమంలో జ్యోతిక ఇటీవల తన సిస్టర్స్ తో దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. అయితే జ్యోతిక ఇప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నప్పటికీ ఆమె సిస్టర్స్ నగ్మా, రోషిణి మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అయితే అక్కా చెల్లెళ్లు కలిసి కట్టుగా దిగిన పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…