Renu Desai : రేణూ దేశాయ్ అంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగా అందరికి గుర్తొస్తుంది. బద్రి’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణూ ఆయనతో కలిసి జాని సినిమా కూడా చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడడం అది ప్రేమగా మారి 2009లో పవన్-రేణు పెళ్లి చేసుకున్నారు. ఇక అనుకోని కారణాల వలన 2012లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీళ్లకు అకీరా, ఆద్య అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇక హీరోయిన్, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్.. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతుంది.
అయితే తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తరుచుగా సమాచారాన్ని అందిస్తుంటుంది. తాజాగా ఆమె ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యపై రేణూ దేశాయ్ పోస్ట్ పెట్టింది. త్వరలోనే కోలుకొని సాధారణ స్థితికి వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా గుండె సంబంధ సమస్య, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలిపింది. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే తనలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ధైర్యాన్నివ్వడం కోసం, వారిలో పాజిటివిటీని నింపేందుకే అని పేర్కొంది.
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకూడదని, శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా బలంగా ఉండాలని రేణూ పేర్కొంది. ఎప్పటికైనా ఫలితం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను మీపై, మీ జీవితంపై ఆశను వదులుకోవద్దు అంటూ రేణూ దేశాయ్ తన పోస్ట్లో తెలియజేసింది. మనకోసం ఈ విశ్వం ఎన్నో అద్భుతాలను దాచివుంచిందని, ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఎదుర్కోవాలంటూ పేర్కొంది. ప్రస్తుతం నేను ఈ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నానని, యోగా, ఔషధాలు, పోషకాహారాన్ని తీసుకుంటున్నట్లు, త్వరలోనే తాను సాధారణ స్థితికి వచ్చి తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నట్లు వెల్లడించింది . అయితే రేణూ తన ఆరోగ్య పరిస్థితిపై సడెన్గా ఇలాంటి కామెంట్ చేయడంతో అందరు షాక్లో ఉన్నారు. త్వరగా కోలుకోవాలని పోస్ట్లు పెడుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…