Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందాన ఇటీవలి కాలంలో సినిమాలతో పెద్దగా సందడి చేయకపోయిన కూడా ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రష్మిక నయా ట్రీట్తో ఇంటర్నెట్ అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుంది. తన ఫాలోవర్స్ అందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సింపుల్గా ఆమె చేసిన పని కుర్రాళ్లకి బాడీలు హీటెక్కిపోతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో నేషనల్ వైడ్ చాలా బిగ్ టాపిక్ అయ్యింది. ఆ వీడియో పై సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాంటి యాక్షన్స్ పై గవర్నమెంట్ దృష్టి పెట్టాలంటూ వ్యాఖ్యానించారు.
రష్మికకి ఎదురైన ఈ విచిత్ర అనుభవం గురించి ఆమె ఎక్స్ బాయ్ఫ్రెండ్ రక్షిత్ శెట్టి మాట్లాడారు. ఆయన నటించిన ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ మూవీ రిలీజ్ కి సిద్దం అవుతున్న నేపథ్యంలో ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షిత్ ని రష్మిక ఫేక్ వీడియో గురించి ప్రశించారు. ఇలాంటి వాటి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్వేర్ కి లైసెన్స్ కంపల్సరీ అనే రూల్ తీసుకు రావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్వేర్స్ అందరికి అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ముందుగా అరికట్టాలి” అంటూ చెప్పుకొచ్చారు. రష్మికకి సపోర్ట్ గా అందరు కదిలి వస్తున్న నేపథ్యంలో తనకు వచ్చిన ఆదరణ, సహకారం పట్ల ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆమెకి అందిన సపోర్ట్ కింద ఆ సమస్య చిన్నదైపోయింది. దాన్నుంచి బయటపడింది రష్మిక.
ఇదిలా ఉంటే రష్మిక కొద్ది రోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న రష్మిక ఆ కారణంగానే ఆమె కమిట్ అయిన సినిమాలో షూటింగ్స్ మొత్తానికి కాస్త బ్రేక్ తీసుకుందట. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టిన ఈ భామ త్వరగా హెల్త్ రికవరీ కావాలని , ఆ తర్వాతే సినిమాలు అన్నట్టుగా తెలియజేసింది. ఇక ఇదిలా ఉంటే రష్మిక ఇటీవల విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాలు చేశారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారని టాక్. దీంతో అప్పట్నుంచి అడపాదడపా విజయ్ ఇంటికి వస్తుంది రష్మిక.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…