Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. రష్మిక తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్ చేసిందని, జస్ట్ ఈ ఐదారేళ్లలో ఆలోవర్ ఇండియా క్రేజ్ సంపాదించడమే కాదు ఓ ఐదు లగ్జరీ అపార్ట్మెంట్స్ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, కూర్గ్, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో రష్మికకు ఖరీదైన అపార్ట్ మెంట్స్ ఉన్నాయంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా వీటన్నింటి పై రియాక్ట్ అయ్యింది రష్మిక. తన గురించి వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవాలే అంటూ చెప్పుకొచ్చింది. నాపై వచ్చే రూమర్స్ అన్ని నిజమైతే బాగుండు అని కామెంట్ చేసింది రష్మిక. ఇక నేషనల్ క్రష్కు నెటిజన్స్ సైతం మద్దతు తెలుపుతున్నారు. ఈ ఏడాది రష్మిక వారిసు.. మిషన్ మజ్నూ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది.
వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న ఇటీవల వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. నిజం చెప్పాలంటే పుష్ప వరకు రష్మిక మందన అంటే కొందరికి ఇష్టం. పుష్ప1 తర్వాత బన్నీ అభిమానులు రష్మిక కి కూడా ఫాన్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక మందన .. బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . ఎవరు ఊహించిన విధంగా డిమాండ్ చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. నేషనల్ క్రష్గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఈ అమ్మడు రానున్న రోజులలో తన క్రేజ్ మరింత పెంచుకుంటుంది.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…