Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందాన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుంది. కన్నడం నుంచి తెలుగుకు, ఆ తర్వాత తమిళం, తాజాగా బాలీవుడ్ బాట పట్టి ఇప్పుడు అక్కడ కూడా మంచి విజయాలు సాధిస్తుంది. పుష్ప సినిమా ఘనవిజయంతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన రష్మిక ఈ ఏ డాది సంక్రాంతికి వారసుడు సినిమాతో పలకరించింది. తాజాగా రణ్బీర్ కపూర్తో చేసిన యానిమల్తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యానిమల్ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న క్రమంలో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది.
రష్మిక మందన్నను ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 40 మిలియన్ల మంది, అంటే 4 కోట్ల మంది ఫాలో అవుతున్నారు . ‘యానిమల్’ సినిమా విజయం సాధించడం ఈ భామకు క్రేజ్ మరింత పెరిగింది. దక్షిణాది హీరోయిన్స్లో ఇది ఒక రికార్డు అని చెప్పాలి. ఇంతవరకు ఎవరూ ఈ మార్క్ ను టచ్ చేయలేకపోయారు. సౌత్లో మంచి క్రేజ్ దక్కించుకున్న రష్మిక..బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్తో ‘గుడ్బై’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటించింది. ఇప్పుడు రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాలో నటించి పాపులారిటీ పెంచుకుంది.
యానిమల్ చిత్రం ఒక మనిషి.. క్రూరుడిగా ఎందుకు మారాడనే కాన్సెప్ట్తో రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్తో అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. యానిమల్ మూవీతో దర్శకుడిగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోగా, ఈ సినిమాతో రణ్బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగాలకి మంచి బూస్టప్ వచ్చినట్టు అయింది. ఇక ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం పుష్ప2 చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తే అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…