వినోదం

Rana Naidu : ఈ సారి బోల్డ్ కంటెంట్ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డుతున్న రానా నాయుడు

Rana Naidu : టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్ట‌రీ వెంక‌టేష్‌కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫ్యామిలీ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన వెంక‌టేష్ కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు చేశారు. ఫ్యామిలీ మ్యాన్ అనే ముద్ర ఆయ‌న‌కు ఉంది. కుటుంబ ప్రేక్షకులు, మరి ముఖ్యంగా మహిళలలో వెంకీ అభిమానులు ఎక్కువ ఉండ‌గా వెంకీ ప్ర‌తి సినిమాల‌ని వారు త‌ప్ప‌క చూస్తారు. అయితే కొద్ది రోజుల క్రితం విడుద‌లైన రానా నాయుడు వెబ్ సిరీస్ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. వెంక‌టేష్ న‌టించాడు అనే స‌రికి కుటుంబం మొత్తం ఇంట్లో కూర్చొని ఈ వెబ్ సిరీస్ చూడ‌గా, ఇందులో అడల్ట్ సీన్లు, బూతు డైలాగులు వెంకీ అభిమానులకు నచ్చలేదు. దాంతో తెలుగులో ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి.

రానా నాయుడు వెబ్ సిరీస్ మీద తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వెంకటేష్ వరకు వెళ్ళడంతో ఆయ‌న రెండో సీజ‌న్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. సైంధవ సినిమాలో పాట విడుదల కోసం ఓ కాలేజ్‌కి వెళ్లిన వెంక‌టేష్‌ని ‘రానా నాయుడు’ రెండో సీజన్ గురించి ఓ స్టూడెంట్ ప్రశ్నించగా… ”వెళుతున్నా అమ్మా! జనవరి నుంచి స్టార్ట్ చేస్తా! నాగా నాయుడు మామూలోడు కాదు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసేశారు. ఇప్పుడు మళ్లీ తీయమంటున్నారు. అయితే… ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఏమో ‘ఏంట్రా నువ్వు అలా చేశావు’ అన్నారు. మీ కుర్రవాళ్ళు ఏమో అందరూ చూసేశారు. కాని ఈ సారి మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకుంటాను అని వెంకీ అన్నారు.

Rana Naidu

‘రానా నాయుడు’ ఫస్ట్ సీజన్ చూసి మనవాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు. ఏం పర్లేదు… ఈసారి చాలా చక్కగా ఉంటుంది. జాగ్రత్త పడతా. కాకపోతే కొంచెం కొంటెగా, అల్లరిగా ఉంటుంది” అని చెప్పారు. సైంధవ్ విడుదలయ్యాకే వెంకటేష్ ఫ్రీ కాబోతున్నారు. జనవరి 13 దాకా నాన్ స్టాప్ ప్రమోషన్లు ప్లాన్ చేసిన నేపథ్యంలో నెల రోజులకు పైగా పూర్తి షెడ్యూల్ దానికే ఇవ్వబోతున్నారు. గణేష్ తర్వాత ఆ రేంజ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సైంధవ్ లో ఉంటుందని అంచనాలు బలంగా ఉన్నాయి. హిట్ ఫస్ట్ కేసు, సెకండ్ కేస్ లతో వరస బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను తక్కువ టైంలోనే పెద్ద హీరోతో ఛాన్స్ కొట్టేశాడు. గుంటూరు కారం, ఈగల్, ఫ్యామిలీ స్టార్ తదితర సినిమాలతో సైంధవ్ కు గట్టి పోటీ ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM