Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ అందుకున్న ప్రభాస్ రీసెంట్గా సలార్ చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా బడా హిట్ కొట్టింది. అయితే ప్రభాస్ డైలాగ్ని హైదరాబాద్ పోలీసులు వాడుకొని మందుబాబులకి వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 21న విడుదలైన ప్రభాస్ సలార్ మూవీ అదిరిపోయే టాక్తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటోంది. సినిమాలోని ఫైట్స్, ప్రభాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో సలార్లోని పాపులర్ డైలాగ్ని ఉపయోగించుకుంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వచ్చే నష్టాలను తెలిపేలే ఓ వీడియో క్రియేట్ చేశారు.
తాజా వీడియాలో ప్రభాస్ డైలాగ్స్కు మ్యాచ్ చేస్తూ లిక్కర్, యాక్సిడెంట్ ఫొటోలను చూపించారు. “ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పాగా” అని ప్రభాస్ డైలాగ్కు లిక్కర్ ఫొటోలు పెట్టి దాన్ని ముట్టుకోవద్దు అని అర్థం వచ్చేలా క్రియేట్ చేశారు. “ప్లీజ్ ఐ కైండ్ లీ రిక్వెస్ట్” అని ప్రభాస్ చెప్పే డైలాగ్తో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని పేర్కొంటూ కారు ప్రమాదాలు జరిగిన విజువల్స్ చూపించడం ఆసక్తిని రేకెత్తించింది.. ఇలా సలార్లో ప్రభాస్ డైలాగ్స్ను న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల క్షేమం కోసం పోలీసులు ఉపయోగించడం ఆసక్తిని రేకెత్తించింది.
సలార్: సీజ్ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. దీనికి 8 రోజుల్లో తెలుగులో రూ. 130.25 కోట్లు, తమిళంలో రూ. 9.90 కోట్లు, కర్నాటకలో రూ. 19.80 కోట్లు, కేరళలో రూ. 6.00 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 53.95 కోట్లు, ఓవర్సీస్లో రూ. 54.65 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 274.55 కోట్లు షేర్, రూ. 535 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్: సీజ్ఫైర్’ మూవీకి వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 535 కోట్లు వరకూ గ్రాస్ వసూలు చేసింది. తద్వారా మూడు సార్లు రూ. 500 కొట్టిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఇక, ఈ చిత్రం హిందీలో రూ. 100 కోట్లు నెట్ను చేరినట్లు యూనిట్ తెలిపింది. దీంతో ప్రభాస్ 5 సార్లు ఈ ఫీట్ సాధించినట్లైంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…