Pallavi Prashanth Prize Money : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఎట్టకేలకి ముగిసింది. 19మంది కంటెస్టెంట్స్తో సందడిగా సాగిన బిగ్ బాస్ షో కార్యక్రమంలో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఫైనల్ కి చేరిన 6 గురిలో అత్యధిక ఓట్లు సాధించిన ప్రల్లవి ప్రశాంత్ కే బిగ్ బాస్ 7 కిరీటం దక్కింది. రైతు బిడ్డకే ప్రజలు పట్టం కట్టారు. శివాజీ, అమర్ గట్టి పోటీ ఇవ్వగా చివరకు విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో అతడికి 35లక్షల నగదుతో పాటు మారుతి కారు, 15 లక్షల విలువైన బంగారం దక్కనుంది. యావర్ 15 లక్షలు తీసుకోవడంతో ప్రశాంత్ ప్రైజ్ మనీలో రూ.15లక్షలు తగ్గాయి.
అయితే యావర్ రూ.15లక్షలు తీసుకున్నా కూడా ప్రశాంత్కి ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు రావడం అలానే, జోయాలుకాస్ వారు ఇచ్చే నగల విలువ రూ. 15 లక్షలు, బ్రీజా కారు విలువ సుమారు రూ. 12 లక్షలు ఉంటుందని తెలుస్తుండగా, మొత్తంగా పల్లవి ప్రశాంత్కు వచ్చింది రూ. 62 లక్షలు.అయితే ఇందులో ప్రైజ్ మనీని తాను ముందుగా చెప్పినట్టు రైతులకి సాయంగా అందిస్తానని కారుని తన తండ్రికి, గోల్డ్ ని తన తల్లికి అందించబోతున్నట్టు వేదికమీదే చెప్పారు ప్రశాంత్. ఆయన చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ప్రశాంత్కి రైతు బిడ్డ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ హౌస్ లో మాట్లాడుతూ వచ్చాడు. దీనితో ఆడియన్స్ రైతు బిడ్డకి ఓట్లు గుద్దేశారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ సైలెంట్ గా వచ్చి బిగ్ బాస్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడు.
అయితే బిగ్ బాస్ రియాలిటీ షో సెలెబ్రిటీలు బయటకి వస్తే దాడి చేసేంతగా మారింది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్, మరియు రన్నర్ గా అమర్ దీప్ నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య హౌస్ లో తార స్థాయికి చేరిన గొడవలు జరగడడంతో అది మనసులో పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ ఫేక్ ఫ్యాన్స్ అమర్ దీప్ని అతని ఫ్యామిలీని తరిమితరిమి కొట్టారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. వందలాది మంది అల్లరి మూకల గుంపు అతని కారుపై ఒక్కసారిగా దాడి చేసింది. దాదాపు అరగంట పాటు.. కారులోనే ఉండిపోయిన అమర్ దీప్ని అతని ఫ్యామిలీని వెంటాడి వేటాడినట్టుగా దాడి చేసి.. వాళ్లని భయభ్రాంతుల్ని చేశారు. కారులో అమర్ దీప్ తల్లి.. అతని భార్య.. స్నేహితుడు నరేష్ లొల్ల.. డ్రైవర్ ఈ నలుగురూ ఉండగా, ఆ సమయంలో వారు ప్రాణాలని అరచేతిలో పెట్టుకున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…