Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైతన్య రోజు రోజుకి తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్ దూత. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా.. తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 24గంటల్లోనే నేషనల్ వైడ్ నెంబర్ 1 సిరీస్గా.. ప్రైమ్లో ర్యాంక్ వచ్చేలా చేసుకుంది. ఇందులో నాగ చైతన్య జర్నలిస్టుగా నటించారు. పేపర్లో వచ్చిన ఆర్టికల్లో ఉన్నట్టే తన లైఫ్లో జరగడం.. అది ఓ మర్డర్తో కనెక్ట్ అవ్వడం.. అండ్ మధ్యలో వచ్చే సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ ఈ సిరీస్ చూస్తున్న వారికి థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చింది. సినిమా సక్సెస్లు లేక బాధపడుతున్న చైతన్యకి ఈ వెబ్ సిరీస్ మంచి బూస్టప్ ఇచ్చింది.
అయితే దూతకి సంబంధించి ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగ చైతన్య తను నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన లాల్ సింగ్ చడ్డా మూవీలో నటించినందుకు తనకు ఎలాంటి పశ్చాతాపం, చింత లేదని అన్నారు. అమీర్ తో కలిసి పని చేయడం వలన తను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు స్పష్టం చేశారు. నాకు సినిమా ఫ్లాఫ్ అవుతుందని ముందుగానే తెలిసినా కూడా అందులో నటించేవాడనని చెప్పారు. ఆ చిత్రం ఆఫర్ ఇప్పుడు వచ్చిన కూడా తాను చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చై స్పష్టం చేశాడు. అమీర్తో కలిసి పని చేయడం సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేశాడు.
ప్రతి ఒక్కరికి జయాపజాయాలు వస్తుంటాయని, వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని అక్కినేని హీరో అన్నాడు. కస్టడీ ఫ్లాప్ తర్వాత నాగచైతన్య తదుపరి తండేల్ మూవీ చేస్తున్నారు.. చందూ మొండేటీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా, కొద్ది రోజుల క్రితం అనౌన్స్మెంట్ చేశారు. పాకిస్థాన్ చేతికి చిక్కి.. మళ్లీ భారత్కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం జాలరి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. జాలరిగా ఈ చిత్రంలో నాగ చైతన్య కనిపించి అలరించబోతున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…