Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైతన్య రోజు రోజుకి తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్ దూత. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా.. తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 24గంటల్లోనే నేషనల్ వైడ్ నెంబర్ 1 సిరీస్గా.. ప్రైమ్లో ర్యాంక్ వచ్చేలా చేసుకుంది. ఇందులో నాగ చైతన్య జర్నలిస్టుగా నటించారు. పేపర్లో వచ్చిన ఆర్టికల్లో ఉన్నట్టే తన లైఫ్లో జరగడం.. అది ఓ మర్డర్తో కనెక్ట్ అవ్వడం.. అండ్ మధ్యలో వచ్చే సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ ఈ సిరీస్ చూస్తున్న వారికి థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చింది. సినిమా సక్సెస్లు లేక బాధపడుతున్న చైతన్యకి ఈ వెబ్ సిరీస్ మంచి బూస్టప్ ఇచ్చింది.
అయితే దూతకి సంబంధించి ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగ చైతన్య తను నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన లాల్ సింగ్ చడ్డా మూవీలో నటించినందుకు తనకు ఎలాంటి పశ్చాతాపం, చింత లేదని అన్నారు. అమీర్ తో కలిసి పని చేయడం వలన తను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు స్పష్టం చేశారు. నాకు సినిమా ఫ్లాఫ్ అవుతుందని ముందుగానే తెలిసినా కూడా అందులో నటించేవాడనని చెప్పారు. ఆ చిత్రం ఆఫర్ ఇప్పుడు వచ్చిన కూడా తాను చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చై స్పష్టం చేశాడు. అమీర్తో కలిసి పని చేయడం సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేశాడు.
ప్రతి ఒక్కరికి జయాపజాయాలు వస్తుంటాయని, వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని అక్కినేని హీరో అన్నాడు. కస్టడీ ఫ్లాప్ తర్వాత నాగచైతన్య తదుపరి తండేల్ మూవీ చేస్తున్నారు.. చందూ మొండేటీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా, కొద్ది రోజుల క్రితం అనౌన్స్మెంట్ చేశారు. పాకిస్థాన్ చేతికి చిక్కి.. మళ్లీ భారత్కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం జాలరి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. జాలరిగా ఈ చిత్రంలో నాగ చైతన్య కనిపించి అలరించబోతున్నాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…