Koose Munisamy Veerappan OTT : వీరప్పన్.. ఒకప్పుడు ఈ పేరు చెబితే అందరిలో వణుకు పుట్టేది. నరహంతకుడిగా, ప్రభుత్వాలని గడగడలాడించిన అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అందరిని వణికించాడు. ఆయన రూపం చూస్తే ఎవరికైన భయం కలుగుతుంది. చేతిలో తుపాకీ.. క్రూరత్వమైన వ్యక్తిత్వం కలిగిన బందిపోటు కొన్ని దశాబ్దాలపాటు భద్రతా దళాలకు, పలు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారాడు. వీరప్పన్ పూర్తి పేరు.. కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్.. వీరప్పన్ ఎర్ర చందనం, ఏనుగు దంతాల స్మగ్లర్.. తన దురాఘతాన్ని ఎదురించిన ఎందరినో కిడ్నాప్ చేశాడు. ఆయన కిడ్నాప్ చేసిన వారిలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం ఉన్నారు.
కర్ణాటక రాష్ట్ర క్యాడర్కు చెందిన ఐ.ఎ.ఎస్. అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ ని వీరప్పన్ హత్య చేయడం తెలిసిందే. కోట్లాది రూపాయల విలువైన గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసిన వీరప్పన్.. తన స్మగ్లింగ్కు అడ్డుగా ఉన్నారని.. 150 మందిని పైగా అతి దారుణంగా చంపాడు.. ఓ అధికారి తల నరికి ఫుట్బాల్ కూడా ఆడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే 2004, అక్టోబర్ 18న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను ఎన్కౌంటర్లో హతమార్చారు. అయితే ఇప్పుడు ఆయన పూర్తి జీవితాన్ని, అతని చుట్టూ జరిగిన ఘటనలని తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’తో ఆవిష్కరించబోతున్నారు.
అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్ను రూపొందించారు. ఈ క్రమంలో సదరు బందిపోటు దొంగకు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో జీ5 ఎక్స్క్లూజివ్గా డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. అతని పూర్తి జీవితాన్ని ఆవిష్కరిస్తూనే అతని చుట్టూ జరిగిన ఘటనలను గురించి కూడా తెలియజేస్తుంది. కూసే మునస్వామి వీరప్పన్పై ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన దృక్పథం ఏర్పడుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…