Koose Munisamy Veerappan OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన కూసే మునిస్వామి వీరప్పన్ చిత్రం.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అంటే..!

December 16, 2023 5:07 PM

Koose Munisamy Veerappan OTT : ప్రేక్షకులపై థియేటర్ల ప్రభావం ఎంత ఉందో తెలియ‌దు కాని, ఓటీటీ ప్ర‌భావం మాత్రం చాలా ఉంది. ఓటీటీలో వ‌చ్చే కంటెంట్‌ని మిస్ కాకుండా చూస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే కూర్చుని చక్కగా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వారి టేస్ట్ కు తగ్గట్లుగానే ప్రతీవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ చేస్తుండ‌గా, వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ బయోపిక్‌గా వచ్చిన కూసే మునిస్వామి వీరప్పన్ ఓటీటీలో డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కూసే మునస్వామి వీరప్పన్ ఒరిజినల్‌ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ జీ5లో డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు.

డిసెంబర్ 8 నుంచి ప్రసారం చేస్తున్నట్లు మొద‌ట‌ మేకర్స్ ప్రకటించినప్ప‌టికీ చెన్నైలో వరదల కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు డిసెంబర్ 14 నుంచి జీ5లో కూసే మునిస్వామి వీరప్పన్ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేస్తున్నారు . దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘కూసే మునిస్వామి వీరప్పన్’ని చూసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీర‌ప్పన్ జీవితంపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. గతంలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం వీరప్పన్ పై ఓ చిత్రాన్ని తీశాడు.

Koose Munisamy Veerappan OTT know the platform and streaming details
Koose Munisamy Veerappan OTT

రీసెంట్‌గా వీర‌ప్ప‌న్ జీవిత చరిత్ర ఆధారంగా ‘కూసే మునిస్వామి వీరప్పన్’ అనే టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ రూపొందింది. ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దానికి విశేష స్పందన లభించింది. ఈ సిరీస్ కు శరత్ జ్యోతి దర్శకత్వం వహించాడు. కాగా.. గతంలో వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా పలు సినిమాలు వచ్చిన సంగతి మనకు తెలియనిది కాదు. మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టాడు వీరప్పన్. గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ.. అటు ప్రభుత్వాలకు ఇటు పోలీసులకు చిక్కకుండా తిరిగాడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేసిన ఎన్ కౌంటర్ లో మరణించాడు వీరప్పన్. ఈ సిరీస్‌లో వీరప్పన్ స్వయంగా నెరేషన్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now