Kirak RP : జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న ఆర్పీ ఇప్పుడు బిజినెస్లోకి దిగాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అవుతున్నారు.హైదరాబాద్ లో ఇప్పటికే మూడు బ్రాంచ్ లను ఓపెన్ చేసిన ఆర్పీ అనంతపురానికి సంబంధించి ఫ్రాంఛైజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తిరుపతిలో కూడా స్టార్ట్ చేశారు. తిరుపతిలో అవుట్ లెట్ను మంత్రి ఆర్కే రోజా చేత ప్రారంభించిన కిరాక్ ఆర్పీ త్వరలోనే తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఫ్రాంచేజీ లను ఇస్తున్నామన్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా చేపల వంటకాలను అందుబాటులో తెచ్చామన్నారు. కీరాక్ ఆర్పీ రెస్టారెంట్ ఓపెనింగ్ లో సినీ నటి మెహరీన్ కూడా సందడి చేసింది.
ఆర్పీకి ఉండే క్రేజ్ వల్ల రేట్స్ బాగా పెంచుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇలా అయితే కొన్ని నెలల పాటు బిజినెస్ బాగా జరిగినా దీర్ఘకాలంలో ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది.ఆర్పీ రేట్లు తగ్గిస్తే బిజినెస్ బ్రహ్మాండంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు . నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు విశేష ప్రజాదరణ అందుకుందన్నారు. ఆర్పీ రెస్టారెంట్లో కొరమేను, గండి, రవ్వ, సన్న చేపలు, తలకాయ చేపల పులుసు, బొమ్మిడాయల పులుసుతో పాటు.. రాగి సంగటి రుచికరంగా అందిస్తున్నట్లు అవుట్ లెట్ నిర్వహకులు తెలిపారు. కిరాక్ ఆర్పీ కి చెందిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ను తిరుపతి మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిలతో కలిసి మంత్రి రోజా ప్రారంభించారు.
తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించిన కిరాక్ ఆర్పీని మంత్రి రోజా అభినందించారు. కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు చేపల పులుసు తినడం లేదని, ఆ తరువాత వచ్చి రుచి చూస్తానన్నారు ఆర్కే రోజా తెలిపారు. ప్రస్తుతం బిజినెస్తో ఫుల్ బిజీగా ఉన్న ఆర్పీ జబర్దస్త్ షోలోకి మాత్రం రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. ఆ మధ్య జబర్ధస్త్పై దారుణమైన కామెంట్స్ చేశారు ఆర్పీ. ఇది పెద్ద రచ్చగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…