Kirak RP : జబర్ధస్త్ వీక్షించిన వారికి కిర్రాక్ ఆర్పీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కొన్నాళ్లు జబర్ధస్త్లో తన కామెడీతో ఎంతగానో అలరించిన ఆర్పీ బయటకు వచ్చి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు అంటూ కర్రీ పాయింట్ను ఓపెన్ చేసాడు. దీనికి మంచి గిరాకీ ఉండడంతో ఆ తర్వాత మణికొండ, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేశాడు. ఇటీవలే నెల్లూరులోనూ చేపల పులుసు పెంటర్ ప్రారంభించాడు. ప్రముఖ నటి, మంత్రి రోజా చేతుల మీదుగా ఈ కర్రీ పాయింట్ ఓపెనింగ్ అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.
అయితే కిర్రాక్ ఆర్పీ తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీ ప్రసన్నను ఘనంగా పెళ్లాడారు. వీరి వివాహ వేడుక విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. వైజాగ్లో సముద్ర తీరాన వీరి పెళ్లి జరగగా, మేలో హైదరాబాద్ వేదికగా నిశ్చితార్థం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ వీరి పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.అయితే కిర్రాక్ ఆర్పీ గతంలో తనది లవ్ ఎట్ ఫట్ సైట్ అని అన్నాడు. ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో మొదటిసారి చూశానని.. చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పిన ఆర్పీ, ఆమె ఫోన్ నెంబర్ అడిగారట. అప్పుడు ఆమె తన తల్లి ఫోన్ నెంబర్ను ఆర్పీకి ఇచ్చారట.
మొదట లక్ష్మీ ప్రసన్న తల్లిని ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న ఆర్పీ ఆమెతో అనుబంధం కొనసాగించారట. ఏడాది తర్వాత తన ప్రేమ విషయాన్ని లక్ష్మీ ప్రసన్న తల్లికే చెప్పారట. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో వారి పెళ్లికి మొదట నో చెప్పిన ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న చేసిన ఫైట్ వలన కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక 2020లో దర్శకుడిగా మారిన ఆర్పీ తన తొలి సినిమాను ప్రకటించారు. జేడీ చక్రవర్తి హీరోగా సినిమా ప్రారంభించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతుందని ప్రకటించిన ఈ సినిమా ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…