Karthika : అలనాటి అందాల తార రాధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.80లలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన రాధ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎక్కువ చిత్రాలలో నటించి అలరించింది. చిరు, రాధ కలిసి స్టెప్పులేస్తే ఫ్యాన్స్ ఫుల్ థ్రిల్ అయ్యేవారు. అయితే రాధ వారసురాలిగా కార్తీక ఇండస్ట్రీలోకి వచ్చింది. హీరోయిన్గా ఓ వెలుగు వెలగాలని ఇండస్ట్రీలోకి వచ్చిన కార్తీకకు మొదట్లో మంచి సినిమాలే పడ్డాయి. ‘రంగం’ రూపంలో ఆమెకు మంచి బ్రేక్ కూడా లభించిన తర్వాత ఎందుకో సక్సెస్ కాలేకపోయింది.. నాగ చైతన్యతో జోష్ అనే చిత్రంలో కూడా నటించింది.ఇక టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ రావడంతో.. ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ అనే చిత్రంలో మాత్రమే కార్తీక కనిపించింది. ఆ సినిమా తర్వాత ఆమె దాదాపు వెండితెరకు దూరమైంది.
అవకాశాలు రాలేదో.. మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. సినిమాకి దూరంగా ఉన్న కార్తీక బిజినెస్ చేసుకుంటూ సత్తా చాటుతుంది. ఇటీవల రాధ పెళ్లి గురించి తెగ వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కార్తీక నిశ్చితార్థం జరగగా, ఆమె నిశ్చితార్థం ఫొటోలని షేర్ చేసింది. దీంతో ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అని కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కార్తీక నాయరే తన సోషల్ మీడియా వేదికగా కాబోయే భర్తని పరిచయం చేసింది. ఇద్దరు కౌగిలించుకుని ఉన్న పిక్ని షేర్ చేసిన కార్తీక అందులో తన ఎంగేజ్మెంట్ రింగ్ చూపించి.. తనకు నిశ్చితార్థం అయినట్లుగా వెల్లడించింది.
ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేసిన కార్తీక.. “నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్డౌన్ ప్రారంభించా.. ” అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అతనిపై తనకి ఉన్న ప్రేమని తెలియజేసింది. కార్తీక కామెంట్స్ని చూస్తే వీరిద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ జంటని చూసి ప్రతి ఒక్కరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రోహిత్ మేనన్ దుబాయ్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ జంటని చూసి ప్రతి ఒక్కరు చూడముచ్చటైన జంట అని కామెంట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…