Karthika : అలనాటి అందాల తార రాధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.80లలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన రాధ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎక్కువ చిత్రాలలో నటించి అలరించింది. చిరు, రాధ కలిసి స్టెప్పులేస్తే ఫ్యాన్స్ ఫుల్ థ్రిల్ అయ్యేవారు. అయితే రాధ వారసురాలిగా కార్తీక ఇండస్ట్రీలోకి వచ్చింది. హీరోయిన్గా ఓ వెలుగు వెలగాలని ఇండస్ట్రీలోకి వచ్చిన కార్తీకకు మొదట్లో మంచి సినిమాలే పడ్డాయి. ‘రంగం’ రూపంలో ఆమెకు మంచి బ్రేక్ కూడా లభించిన తర్వాత ఎందుకో సక్సెస్ కాలేకపోయింది.. నాగ చైతన్యతో జోష్ అనే చిత్రంలో కూడా నటించింది.ఇక టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ రావడంతో.. ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ అనే చిత్రంలో మాత్రమే కార్తీక కనిపించింది. ఆ సినిమా తర్వాత ఆమె దాదాపు వెండితెరకు దూరమైంది.
అవకాశాలు రాలేదో.. మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. సినిమాకి దూరంగా ఉన్న కార్తీక బిజినెస్ చేసుకుంటూ సత్తా చాటుతుంది. ఇటీవల రాధ పెళ్లి గురించి తెగ వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కార్తీక నిశ్చితార్థం జరగగా, ఆమె నిశ్చితార్థం ఫొటోలని షేర్ చేసింది. దీంతో ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అని కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కార్తీక నాయరే తన సోషల్ మీడియా వేదికగా కాబోయే భర్తని పరిచయం చేసింది. ఇద్దరు కౌగిలించుకుని ఉన్న పిక్ని షేర్ చేసిన కార్తీక అందులో తన ఎంగేజ్మెంట్ రింగ్ చూపించి.. తనకు నిశ్చితార్థం అయినట్లుగా వెల్లడించింది.
ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేసిన కార్తీక.. “నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్డౌన్ ప్రారంభించా.. ” అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అతనిపై తనకి ఉన్న ప్రేమని తెలియజేసింది. కార్తీక కామెంట్స్ని చూస్తే వీరిద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ జంటని చూసి ప్రతి ఒక్కరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రోహిత్ మేనన్ దుబాయ్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ జంటని చూసి ప్రతి ఒక్కరు చూడముచ్చటైన జంట అని కామెంట్ చేస్తున్నారు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…