Balakrishna : నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వయస్సులోనూ బాలయ్య కుర్ర హీరోలకు పోటీగా నటిస్తూ అంతే మొత్తంలో పారితోషికం కూడా అందుకుంటున్నారు. అయితే కొంత కాలంగా ఆయనకు సరైన హిట్లు లేవు. కానీ బోయపాటితో తీసిన అఖండ ఆయనకు మళ్లీ క్రేజ్ను తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే ఆయన నటించిన వీర సింహారెడ్డి మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఘన విజయం సాధించింది. ఓటీటీలోనూ ఈ మూవీ దూసుకుపోతోంది.
బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. పౌరాణిక, సామాజిక, జానపద చిత్రాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో డైలాగ్స్ పలకగలిగే గొప్ప నటుడిగా బాలయ్య పేరుగాంచారు. అయితే అందరు నటుల కెరీర్లో కొన్ని సినిమాలు ఆగిపోయినట్లే బాలయ్య కెరీర్లోనూ కొన్ని మూవీలు ఆగిపోయాయి. ఆ మూవీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలకృష్ణ ప్రధాన పాత్రలో భగవాన్ శ్రీ కృష్ణ అనే మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇందులో బాలయ్య కృష్ణుడిగా కనిపించాల్సి ఉంది. అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. అలాగే అశోక చక్రవర్తి జీవితగాథ ఆధారంగా సామ్రాట్ అశోక అనే మూవీ తీయాలనుకున్నారు. ఇదీ పట్టాలెక్కలేదు. సౌందర్య ద్రౌపదిగా నర్తనశాలను తెరకెక్కించాలనుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా అయింది. అయితే దురదృష్టవశాత్తూ ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. తరువాత ఇంకో హీరోయిన్ ను పెట్టి తీద్దామనుకున్నా వీలు కాలేదు. అలాగే రైతు, శివరంజని అనే మరో రెండు మూవీలు కూడా ఆగిపోయాయి. ఇవి చేసి ఉంటే బాలయ్య ఖాతాలో ఎంత లేదన్నా ఇంకో 3 లేదా 4 హిట్స్ పడి ఉండేవని అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ ఏ మూవీకి కమిట్ అవలేదు. కానీ అఖండ 2వ పార్ట్ మొదలు పెట్టవచ్చని తెలుస్తోంది. దీని గురించి క్లారిటీ రావల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…