Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 17వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అయితే తాజాగా బన్నీ ఓ కంపెనీకి చెందిన యాడ్లో నటించి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. దీంతో అందులో ఆయన చిక్కుల్లో పడ్డారు.
ర్యాపిడో సంస్థకు చెందిన యాడ్లో అల్లు అర్జున్ నటించి అడ్డంగా బుక్కయ్యారు. ఆర్టీసీ బస్సులు వేస్టు.. ర్యాపిడో బైక్ అయితే సాఫీగా ప్రయాణం చేయవచ్చు.. అని చెబుతూ ఆ కంపెనీకి చెందిన యాడ్లో అల్లు అర్జున్ తాజాగా నటించారు. అయితే ఆ యాడ్పై తెలంగాణ ఆర్టీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సదరు సంస్థతోపాటు, అల్లు అర్జున్కు నోటీసులు పంపించారు.
తెలంగాణ ఆర్టీసీని కించపరిచేలా ఉన్న అల్లు అర్జున్ యాడ్ను వెంటనే తొలగించాలని ర్యాపిడో సంస్థకు, అల్లు అర్జున్కు సజ్జనార్ నోటీసులను జారీ చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. లేదంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించారు. అయితే దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టులో కేసు విచారణ జరిగింది.
ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు ర్యాపిడో సంస్థతోపాటు, అల్లు అర్జున్కు షాకిచ్చింది. ఆర్టీసీ పరువుకు నష్టం కలిగించేలా రాపిడో సంస్థ యాడ్ ప్రసారం చేసిందని.. అందువల్ల ఆ సంస్థకు చెందిన బైక్ రైడ్ ప్రకటన చిత్రాలను ప్రసారం చేయకుండా వెంటనే నిలిపివేయాలని హైకోర్టు రాపిడోను ఆదేశించింది.
అలాగే యూ ట్యూబ్ లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు విచారించబడతారని హెచ్చరించింది. ఇక కోర్టు ఆదేశాలపై ర్యాపిడో సంస్థ ఎలా స్పందిస్తున్నది తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…