Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఎదురయ్యింది. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు . విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ని అందిస్తున్నారు చిరంజీవి. మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయినా చిరంజీవిపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ అక్టోబర్ 5 న విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఈ సినిమా సక్సెస్ తో చిరంజీవి మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసారు.
చిరు సినిమా వస్తుందంటే ఎంతటి పెద్ద స్టార్ అయినా సరే తమ సినిమాను వాయిదా వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అందుకు కారణం చిరుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది. ఇంతటి స్టార్డమ్ ఉన్న మెగాస్టార్ ఒకానొక సంధర్బంలో తన సినిమాను ఒక యంగ్ హీరో కోసం వాయిదా వేసుకున్నారు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సరిగ్గా 10 సంవత్సరాల కిందట ఈ ఘటన జరిగింది.
ఎన్టీఆర్ ఆది సినిమాతో మాస్ హిట్ ను అందున్నాడు. ఈ సినిమా తరవాత తెలుగు ప్రేక్షకులలో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది. ఇక ఆది సినిమా తరవాత ఎన్టీఆర్ బి.గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. ఇక అదే సమయంలో బి.గోపాల్ చిరంజీవి హీరోగా ఇంద్ర సినిమాను పూర్తి చేసారు. ఇక ఈ రెండు చిత్రాలను జూలై 18న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట నిర్మాతలు.
కానీ ఒకవేళ ఇంద్ర ఫ్లాప్ అయ్యి అల్లరి రాముడు హిట్ అయితే చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. అప్పటికే చిరంజీవి మంజునాథ, మృగరాజు, డాడీ లాంటి వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్ర సినిమాను ఓ వారం రోజుల పాటూ వాయిదా వేసుకుని జూలై 24వ తేదీన విడుదల చేశారు మూవీ మేకర్స్. కానీ నిర్మాతలు అనుకున్నదానికి భిన్నంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నిర్మాతలు ఊహించని విధంగా ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…