Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఎదురయ్యింది. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు . విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ని అందిస్తున్నారు చిరంజీవి. మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయినా చిరంజీవిపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ అక్టోబర్ 5 న విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఈ సినిమా సక్సెస్ తో చిరంజీవి మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసారు.
చిరు సినిమా వస్తుందంటే ఎంతటి పెద్ద స్టార్ అయినా సరే తమ సినిమాను వాయిదా వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అందుకు కారణం చిరుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది. ఇంతటి స్టార్డమ్ ఉన్న మెగాస్టార్ ఒకానొక సంధర్బంలో తన సినిమాను ఒక యంగ్ హీరో కోసం వాయిదా వేసుకున్నారు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సరిగ్గా 10 సంవత్సరాల కిందట ఈ ఘటన జరిగింది.
ఎన్టీఆర్ ఆది సినిమాతో మాస్ హిట్ ను అందున్నాడు. ఈ సినిమా తరవాత తెలుగు ప్రేక్షకులలో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది. ఇక ఆది సినిమా తరవాత ఎన్టీఆర్ బి.గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. ఇక అదే సమయంలో బి.గోపాల్ చిరంజీవి హీరోగా ఇంద్ర సినిమాను పూర్తి చేసారు. ఇక ఈ రెండు చిత్రాలను జూలై 18న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట నిర్మాతలు.
కానీ ఒకవేళ ఇంద్ర ఫ్లాప్ అయ్యి అల్లరి రాముడు హిట్ అయితే చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. అప్పటికే చిరంజీవి మంజునాథ, మృగరాజు, డాడీ లాంటి వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్ర సినిమాను ఓ వారం రోజుల పాటూ వాయిదా వేసుకుని జూలై 24వ తేదీన విడుదల చేశారు మూవీ మేకర్స్. కానీ నిర్మాతలు అనుకున్నదానికి భిన్నంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నిర్మాతలు ఊహించని విధంగా ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…