Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఎదురయ్యింది. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు . విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ని అందిస్తున్నారు చిరంజీవి. మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయినా చిరంజీవిపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ అక్టోబర్ 5 న విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఈ సినిమా సక్సెస్ తో చిరంజీవి మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసారు.
చిరు సినిమా వస్తుందంటే ఎంతటి పెద్ద స్టార్ అయినా సరే తమ సినిమాను వాయిదా వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అందుకు కారణం చిరుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది. ఇంతటి స్టార్డమ్ ఉన్న మెగాస్టార్ ఒకానొక సంధర్బంలో తన సినిమాను ఒక యంగ్ హీరో కోసం వాయిదా వేసుకున్నారు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సరిగ్గా 10 సంవత్సరాల కిందట ఈ ఘటన జరిగింది.
ఎన్టీఆర్ ఆది సినిమాతో మాస్ హిట్ ను అందున్నాడు. ఈ సినిమా తరవాత తెలుగు ప్రేక్షకులలో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది. ఇక ఆది సినిమా తరవాత ఎన్టీఆర్ బి.గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. ఇక అదే సమయంలో బి.గోపాల్ చిరంజీవి హీరోగా ఇంద్ర సినిమాను పూర్తి చేసారు. ఇక ఈ రెండు చిత్రాలను జూలై 18న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట నిర్మాతలు.
కానీ ఒకవేళ ఇంద్ర ఫ్లాప్ అయ్యి అల్లరి రాముడు హిట్ అయితే చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. అప్పటికే చిరంజీవి మంజునాథ, మృగరాజు, డాడీ లాంటి వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్ర సినిమాను ఓ వారం రోజుల పాటూ వాయిదా వేసుకుని జూలై 24వ తేదీన విడుదల చేశారు మూవీ మేకర్స్. కానీ నిర్మాతలు అనుకున్నదానికి భిన్నంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నిర్మాతలు ఊహించని విధంగా ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…