Balakrishna : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సైన్స్ఫిక్షన్, భక్తిరసాత్మకం.. ఇన్ని జానర్లలో నటించిన ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఆరేళ్లక్రితం హిస్టారికల్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టించారు బాలయ్య. అయితే ట్రెండ్కి తగ్గట్టు బాలయ్య మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. బాలకృష్ణ ప్రస్తుతం పలు టాక్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలానే పలు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు.
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పటికే రెండు సీజన్స్ సక్సెస్ ఫుల్గా పూర్తి చేసిన బాలయ్య సీజన్ 3తో ఇప్పుడు సందడి చేస్తున్నాడు. దీనికి భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్టు సమాచారం. ఇక బాలయ్య వేగ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అలాగే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతుండడంతో పాటు దానికి సంబంధించిన యాడ్ కూడా చేస్తున్నారట. ఇప్పటికే బాలయ్య ఫోటో షూట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి బాలయ్య కి అందుతున్న రెమ్యునరేషన్ దాదాపు 3 కోట్లు. ఇది కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అనే చెప్పాలి.
వరుస ప్రాజెక్ట్ లతో క్రేజ్ ను సొంతం చేసుకుంటున్న బాలయ్య ఇప్పుడు వరుస సక్సెస్లు సొంతం చేసుకుంటున్నాడు. అఖండ చిత్రం తర్వాత బాలయ్యకి ఒకటిని మించి మరొకటి అన్న విజయం దక్కింది. ప్రస్తుతం బాలయ్య అన్ స్టాపబుల్ చేస్తుండగా, దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.సుహాసిని, హరీష్ శంకర్, శ్రియ, జయంత్ సి పరాన్జీ గెస్ట్ లు హాజరైన ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…