Allu Arjun Balakrishna : ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా, నందమూరి, దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలు ఎంత కీలక పాత్రలు పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫ్యామిలీ హీరోలు పలు సందర్భాలలో కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో అల్లు, నందమూరి ఫ్యామిలీ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాయి. ఇటీవల బాలయ్య నటించిన అఖండ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కి బన్నీ గెస్ట్గా వచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇక బాలకృష్ణ హోస్ట్గా అల్లు అరవింద్ అన్స్టాపబుల్ అనే షో చేస్తున్నారు. ఈ సందర్భాలలో ఒకరిపై తెగ ప్రేమ కురిపించుకున్నారు.
అల్లు కాంపౌండ్ లో ఒక ట్రెండ్ ని అల్లు అర్జున్ కొనసాగిస్తున్నాడు. మహానటి చిత్రం మంచి విజయం సాధించినప్పుడు బన్నీ టీం అందరికీ ప్రత్యేకమైన పార్టీ ఇచ్చారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి శ్రీనులతోపాటు అఖండ చిత్ర యూనిట్ కి పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అఖండ చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా అల్లు అర్జున్ ఈ పార్టీ ఏర్పాటు చేశారట. బాలయ్యకు పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా నందమూరి.. అల్లు కుటుంబాల మధ్య బంధం మరింతగా బలపడుతోందని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అల్లు ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీకి దగ్గరవుతున్న క్రమంలో మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి గురించి ఎక్కువగా మాట్లాడే బన్నీ పేరు ఎత్తడం లేదు. అదీ కాక అల్లు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి తరచూ వార్తలలోకి ఎక్కడం.. అనేక అనుమానాలను కలిగిస్తోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…