వినాయ‌కుడిని ఇలా పూజిస్తే.. శ‌ని దోషాలు పోతాయి..!

March 3, 2022 5:10 PM

ముక్కోటి దేవతలలో వినాయకుడు ఎంతో ప్రత్యేకం. మొదటి పూజ్యుడిగా పూజలందుకునే వినాయకుడికి ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ముందుగా పూజ చేస్తే ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భావిస్తారు. అదేవిధంగా బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. బుధవారం రోజు స్వామివారికి దుర్వార పత్రాలతో, గరికతో పూజ చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

గణపతి పూజలో తప్పకుండా ఉండవలసినది గరిక. గరికతోపాటు గన్నేరు పుష్పాలతో స్వామి వారికి పూజ చేయటం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. శని దోషాలతో బాధపడేవారు వినాయకుడికి పత్రాలతో పూజ చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి శని నుంచి విముక్తి కలుగుతుంది.

మనం ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు మాటిమాటికీ అడ్డంకులు ఏర్పడితే దుర్వార పత్ర పూజ చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోయి శుభ కార్యాలు పూర్తి అవుతాయి. బుధవారం స్వామివారికి గరికతో పూజ చేసి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతాము. అదేవిధంగా వినాయకుడి పూజలో తులసి మాలలను ఎటువంటి పరిస్థితులలో కూడా ఉపయోగించకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now