మనం శివాలయానికి వెళ్లగానే అక్కడ మనకు శివలింగం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నంది దర్శనం చేసుకున్న తరువాతనే శివదర్శనం చేసుకోవాలి. ఈ క్రమంలోనే కొందరు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ ప్రార్థిస్తారు. ఈ విధంగా శివుడిని దర్శించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే శివుడిని ఈ విధంగా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
నందీశ్వరుడు పరమశివుడికి పరమ భక్తుడు. అదేవిధంగా శివుడి వాహనం కూడా నందీశ్వరుడే. శివుడి అనుగ్రహం మనపై కలగాలంటే ముందుగా నందీశ్వరుడి అనుగ్రహం తప్పనిసరి. నందీశ్వరుడిని సాక్షాత్తు వేద ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. నంది కొమ్ములలో ఒకటి త్రిశూలానికి, మరొకటి సుదర్శనానికి ప్రతీక అని వేదాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించాలంటే ముందుగా నందీశ్వరుడి ముందు పువ్వులను సమర్పించి.. పృష్ట (వెనుక) భాగాన్ని కుడిచేతితో తాకుతూ.. ఎడమ చేతి వేళ్ళను నందీశ్వరుడి కొమ్ములపై ఉంచి శివలింగ దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా కొమ్మల మధ్యలో నుంచి శివ లింగ దర్శనం చేసుకోవడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…