Lord Hanuman : సీతారామ దాసుడిగా రామ భక్తుడిగా విజయప్రదాతగా రక్షకుడిగా పిలవబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. అంజనా దేవి, కేసరిల పుత్రుడైన హనుమంతుడిని హనుమాన్, మారుతి, భజరంగబలి, వాయు పుత్రుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. వాయుదేవుడి హౌరాస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునుడికి ప్రియ సఖుడు. అమిత పరాక్రముడు. లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు. ఔషధీ సమేతంగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుడి ప్రాణాలు నిలిపినవాడు. హనుమంతుడి నామాలు ప్రయాణం చేసేటప్పుడు, నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యుభయం అస్సలు ఉండదట.
హనుమను స్మరించిన వారికి శుభం కలుగుతుంది. ధైర్య సాహసాలకు హనుమాన్ ప్రతిరూపం. ఆకాశమార్గాన ప్రయాణించి సముద్రం దాటి లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టిన ధీరుడు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాలలో వైశాఖ దశమినాడు జరుపుతారు. ఇక కేరళ రాష్ట్రంలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. ఇంతటి ఘనుడైన హనుమాన్ శ్రీరాముడి సేవకే పరిమితమయ్యాడు.
తన మనసులో శ్రీరామున్ని దాచుకున్నాడు. తన తల్లి కంటే ఎక్కువగా రామున్ని ఆరాధించాడు. అయితే ఒక రోజు సీతమ్మ నుదుటన సింధూరం పెట్టుకుంటుంది. మీరు ఆ సింధూరం ఎందుకు పెట్టుకున్నారు తల్లి అని అడిగితే. శ్రీరాముడు దీర్ఘాయుష్కుడుగా ఉండాలని పెట్టుకున్నాను.. అని చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది సీతమ్మ. దీంతో హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన శరీరం అంతా సింధూరం రాసుకొని శ్రీరాముడిపై తన భక్తిని నిరూపించుకున్నాడు. శ్రీరాముడు ఇంకా ఎక్కువ ఆయుష్షుతో జీవించాలని చెప్పే హనుమ అలా తన శరీరం మొత్తం సింధూరాన్ని రాసుకున్నాడు. అందుకనే హనుమకు సింధూరం అంటే ఇష్టం. భక్తులు కూడా సింధూరంతో బొట్టు పెట్టుకుంటారు. దీంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…