Lord Brahma : భారత దేశం దేవాలయాలకు నెలవు. ఇక్కడ సకల చరాచర సృష్టికి కారణ భూతులైన దేవతలను నిత్యం ఆరాదిస్తారు భక్తులు. అయితే హిందూ శాస్త్ర ప్రకారం అందరికీ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక్క బ్రహ్మకు మాత్రం ఈ భూమి మీద ఆలయాలు కనిపించవు. సర్వ కోటి ప్రాణుల తలరాత రాసే బ్రహ్మకు ఎందుకు దేవాలయాలు లేవు.. కారణం ఏంటి..? బ్రహ్మకు భూలోకంలో పూజలు ఎందుకు జరగవు..? దీనిపై పురాణాలేం చెబుతున్నాయి.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం లోకకళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగుమహర్షిని పంపుతారు. అలా బయలు దేరిన భృగుమహర్షి తొలుత సత్యలోకాన్ని చేరుకుంటాడు.
ఆ సమయంలో వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు, ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీ దేవి సంగీతంలో లీనులై ఉంటారు. భృగుమహర్షి రాకను గమనించకుండా వారి ధ్యానంలో ఉండిపోతారు. దాంతో కోపోద్రేక్తుడైన భృగుమహర్షి కలియుగంలో భూమి మీద నీకు పూజలు ఉండవని శాపమిచ్చి వెళ్లిపోతాడు. అందువలనే బ్రహ్మకు భూలోకంలో దేవాలయాలు ఉండవని.. పూజలు కూడా జరగవని.. చెబుతారు. రాజస్థాన్ లో అజ్మీర్ కు వాయువ్య భాగంలో సుమారు 10 కిలో మీటర్ల దూరంలో పుష్కర్ దగ్గర గాయత్రి గిరిలో శక్తి పీఠం ఉంది. దీనినే బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు. అమ్మవారి కంఠాభరణం ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం.
ఇక్కడి అమ్మవారు గాయత్రీదేవిగా పూజలందుకుంటారు. నిత్యం హోమాలు, పూజలతో కళకళలాడుతుంది. ఈ సరస్సు ఒడ్డునే బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. ఇదొక్కటే ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం. మనదేశంలో అతి ముఖ్య తీర్థరాజంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి తీర్థ రాజ్ అనే సార్థక నామం ఏర్పడింది. ఇక పద్మపురాణం ప్రకారం ఇంకో కథ ఉంది. పద్మపురాణంలో వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించటం చూసి తట్టుకోలేక తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి బ్రహ్మ దేవుడు ఆ రాక్షసుడిని సంహరిచాడట.
ఆ సందర్భంలో ఆ పువ్వు నుండి మూడు రేకులు రాలి మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడ్డాయి. వాటికే జ్యేష్ట పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పేర్లు పెట్టారు. బ్రహ్మ చేతి నుండి జారి పడిన తామర పువ్వు పడిన ప్రదేశం కనుక పుష్కర్ అనే పేరు సార్థకమైంది. అయితే అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నకథ ప్రకారం.. సరస్వతీ దేవి ఎదుటే శివుడు, విష్ణువు కలిసి బ్రహ్మకు గాయత్రి అనే అమ్మాయితో వివాహం చేయిస్తారట. దీనిని చూసి తట్టుకోలేని సరస్వతీ దేవీ బ్రహ్మను వృద్ధుడిగా మారిపోమంటూ శపిస్తుందట. అందుకనే ఆయనకు దేవాలయాలు కూడా ఉండవని చెబుతారు. ఇక పుష్కర్ లో ప్రతి ఏడాది ఒంటెల పరుగు పందాలు జరుగుతాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…