Pariseshanam : పూర్వకాలం నుంచి మన పెద్దలు అనేక ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. వాటిల్లో తినే ప్లేట్ చుట్టూ నీళ్లను చల్లడం కూడా ఒకటి. ఈ అలవాటును మనం మానేశాం. కానీ మన పెద్దలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అయితే ఇలా చల్లడాన్ని పరిశేషణం అంటారు. దీన్ని ఉత్తర భారతంలో చిత్ర ఆహుతి అని పిలుస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు, దీని వల్ల ఏం జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనానికి ముందు పరిశేషణం చేయడం వల్ల ఆహారం శుద్ధి అవుతుందని భావిస్తారు. మనం తినే ఆహారం విషం కాకూడదని, దాని వల్ల మన దేహానికి, బుద్ధికి బలం కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అలా నీళ్లు చల్లుతారు. ఇక పూర్వకాలంలో అరటి ఆకుల్లోనే భోజనం చేసేవారు. ఈ క్రమంలో ఆకు నేలపై ఉన్నప్పుడు చుట్టు పక్కల నుంచి దుమ్ము, ధూళి ఆకులో పడే అవకాశం ఉంటుంది. కనుక ఆకు చుట్టూ నేలపై నీళ్లను చల్లితే అక్కడ దుమ్ము, ధూళి లేవదు. ఆకులో పడదు. దీంతో ఆహారాన్ని ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు.
ఇక పూర్వం రోజుల్లో రాత్రి పూట మనకులా లైట్లు ఉండేవి కావు. దీపం వెలుగులోనే భోజనం చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో రాత్రి అనేక పురుగులు, కీటకాలు వచ్చేవి. అయితే భోజనం చేసేటప్పుడు పురుగులు ఆకులో పడకుండా ఉండేందుకు గాను ఆకు చుట్టూ నీళ్లను చల్లేవారు. ఈవిధంగా పరిశేషణం చేసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే పరిశేషణాన్ని దాదాపుగా అందరూ ఒకేవిధంగా చేస్తారు. చేతిలో నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రం చదువుతూ ప్లేట్ చుట్టూ మూడు సార్లు నీళ్లు చల్లుతారు. తరువాత అన్నపూర్ణా దేవికి నమస్కారం చేసి భోజనం చేయడం మొదలు పెడతారు. ఈవిధంగా ఇప్పుడు చాలా మంది చేయడం లేదు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…