ఆ పరమశివుడిని అభిషేక ప్రియుడు పిలుస్తారు.భక్తులు కోరిన కోరికలు నెరవేరాలంటే పరమేశ్వరుడికి దోసెడు నీటితో అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే చాలు స్వామి వారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలను నెరవెరుస్తాడు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలుగుతుంది. అయితే బిల్వ దళాలు అంటే స్వామి వారికి ఎందుకు అంత ప్రీతికరమో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం సాగరమధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి హాలాహలం ఉద్భవించింది.అయితే పరమశివుడు ఆ విషాన్ని సేవించి సమస్త ప్రాణికోటిని కాపాడాడు. ఈ విధంగా విషం తాగడం చేత శివుడి తల భాగం మొత్తం వేడెక్కింది.ఈ క్రమంలోనే పరమశివుని చల్లబరచడం కోసం దేవతలందరూ శివుడి తలపై నీటితో అభిషేకం చేశారు.అదేవిధంగా బిల్వదళాలకు చల్లదనం ఇచ్చే గుణం ఉండటం వల్ల బిల్వ దళాలను సమర్పించారు.బిల్వ పత్రాలు సమర్పించిన తర్వాత పరమశివుడు ఉపశమనం పొందటంతో అప్పటినుంచి శివపూజలో బిల్వ దళాలకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి బిల్వ దళాలను సమర్పిస్తే తప్పకుండా వారి కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే బిల్వ దళాలను సమర్పించే టప్పుడు తొడిమతో సహా సమర్పించాలి. అదేవిధంగా బిల్వపత్రాలను శివుడికి ఎల్లప్పుడు తలక్రిందులుగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…