ఆ పరమశివుడిని అభిషేక ప్రియుడు పిలుస్తారు.భక్తులు కోరిన కోరికలు నెరవేరాలంటే పరమేశ్వరుడికి దోసెడు నీటితో అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే చాలు స్వామి వారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలను నెరవెరుస్తాడు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలుగుతుంది. అయితే బిల్వ దళాలు అంటే స్వామి వారికి ఎందుకు అంత ప్రీతికరమో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం సాగరమధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి హాలాహలం ఉద్భవించింది.అయితే పరమశివుడు ఆ విషాన్ని సేవించి సమస్త ప్రాణికోటిని కాపాడాడు. ఈ విధంగా విషం తాగడం చేత శివుడి తల భాగం మొత్తం వేడెక్కింది.ఈ క్రమంలోనే పరమశివుని చల్లబరచడం కోసం దేవతలందరూ శివుడి తలపై నీటితో అభిషేకం చేశారు.అదేవిధంగా బిల్వదళాలకు చల్లదనం ఇచ్చే గుణం ఉండటం వల్ల బిల్వ దళాలను సమర్పించారు.బిల్వ పత్రాలు సమర్పించిన తర్వాత పరమశివుడు ఉపశమనం పొందటంతో అప్పటినుంచి శివపూజలో బిల్వ దళాలకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి బిల్వ దళాలను సమర్పిస్తే తప్పకుండా వారి కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే బిల్వ దళాలను సమర్పించే టప్పుడు తొడిమతో సహా సమర్పించాలి. అదేవిధంగా బిల్వపత్రాలను శివుడికి ఎల్లప్పుడు తలక్రిందులుగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…