టాలీవుడ్ ఇండస్ట్రీలో వెండితెర చందమామగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు.తాజాగా గత ఏడాది తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తన స్పీడ్ తగ్గించకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ నాగార్జున సరసన మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అదే విధంగా తమిళంలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహిళా ప్రాధాన్యత ఉన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
కాజల్ అగర్వాల్ జీవితంలోనే ఈ సినిమా ఎంతో విభిన్నమైనదని,డీగ్లామర్ లుక్లో సరికొత్త పంథాలో ఆమె ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులు కొంత వరకు చక్కబడితే ఈ చిత్రం జూలైలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను త్వరలోనే చిత్రబృందం ప్రకటించనున్నారు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…