చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు..? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు.. మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వర్గానికి పోయే మాటను కాసేపు పక్కనపెడితే నరక ప్రయాణం ఎలా ఉంటుందో గరుడ పురాణంలో పూర్తిగా వివరించబడింది. గరుడపురాణం ప్రకారం 47 రోజులు అత్యంత కష్టాలతో యమపురి ప్రయాణం సాగుతుంది. హత్యలు, అక్రమాలు, మానభంగాలు, దొంగతనాలు, కరుడుగట్టిన నేరాలు చేసిన వాళ్లు తప్పకుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది.
చనిపోయే సమయం దగ్గర పడుతున్న వేళ సరిగా మాటలు రావు. చావుకి దగ్గరైనా ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా.. ఏం మాట్లాడలేకపోతాడు. శరీరమంతా స్పర్శ నాశనం అయి ఎలాంటి చలనం లేకుండా.. గట్టిగా మారిపోతుంది. దివ్యదృష్టి తెరుచుకుని చుట్టు జరుగుతున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారట. ఇంకో క్షణంలో తాను చనిపోతున్నా అని తెలియగానే తన కళ్ల ముందు యమధర్మ రాజు పంపిన యమభటులు కనిపిస్తారట. భయకరమైన రూపంలో కనిపించే యమదూతలను చూడగానే నోరు తడారిపోతుంది.
చనిపోయిన శరీరం నుండి ఆత్మను తీసుకుని యమదూతలు ప్రయాణం ప్రారంభిస్తారు. వైతరణి నది పరివాహక ప్రాంతంలో ఈ ప్రయాణం అత్యంత భయంకరంగా సాగుతూ ఉంటుంది. 47 రోజులు ఆత్మలను చిత్రహింసలకు గురి చేస్తూ ఆత్మలను తమ వెంట తీసుకెళతారు యమదూతలు. ఈ ప్రయాణంలో ఆత్మ అలసిపోయినా.. విశ్రాంతి తీసుకోవడానికి చూసినా యమదూతలు అనుమతించరు. పైగా ఇంకా హింసలకు గురి చేస్తారు. ఇక ఆత్మకు యమభటులు పెట్టే క్షోభ అంతా ఇంత కాదు. యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమదూతలు చాలా భయాందోళనలకు గురిచేస్తారు. నరకంలో యమరాజు చెప్పే తీర్పు గురించి వివరించి వణుకుపుట్టేలా చేస్తారు. ఈ సమయంలో ఆత్మ ఏడవడం మొదలుపెడుతుంది. కానీ.. యమదూతలు జాలి, కరుణ, కనికరం చూపించకుండా మరింత బాధపెడుతూ ఆనందపడుతుంటారు.
యమపురి ప్రయాణంలో ఆత్మలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతుంటాయి. కానీ యవభటులు లేపి మరీ కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళతారు. ఎక్కడా ఆగడానికి అవకాశం ఉండదు. ఇక నా వల్ల కాదని మొండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలు అతి కిరాతకంగా చర్నకోలాల్లాంటి కొరడాలతో కొడతారు. అగ్నిలా మండిపోతున్న ఇసుకలో నడిపించుకుంటూ తీసుకెళతారు. ఆత్మలు అత్యంత బాధాకరమైన ఆ దారిలో నడవలేకపోతాయి. అలాగే ఆకలితో ఉంటాయి. ఆ సమయంలో యమదూతలు ఆత్మలను కొరడాలతో కొడుతూ మరింత నరకం చూపిస్తారు.
ఇక ఎలాగోలా యమలోకానికి చేరిన వెంటనే యమరాజు చివరి సారిగా ఆత్మను చనిపోయిన స్థలానికి పంపిస్తాడు. ఇన్నాళ్లు ఉన్న తన శరీరం అంత్యక్రియలను చూసుకునే అవకాశాన్ని కల్గిస్తాడు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా..? లేదా..? ఆత్మ శాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మ మళ్లీ కిందకు వస్తుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే.. ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు 10 రోజుల లోపే పిండ ప్రదానం చేయాలి. లేదా ఇక ఆ ఆత్మకు మోక్షం ఉండదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…