వినాయక చవితి అంటే ముందుగా వినాయకుడి నైవేద్యంగా సమర్పించే ఉండ్రాళ్ళు గుర్తుకు వస్తాయి. స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రోజు స్వామివారికి ప్రత్యేక ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. మరి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్లను ఏవిధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా..!
ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర వేయాలి. ఆ తర్వాత అందులో నీటిని వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. బాగా మరుగుతున్న నీటిలో బియ్యపు పిండి, శనగపప్పు వేసి చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం ఉడికిన తరువాత దించే ముందుగా కొద్దిగా నెయ్యి వేసి దించుకోవాలి. కొద్దిగా చేతికి నూనె రాసుకుని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు తయారైనట్లే. అయితే కొన్ని ప్రాంతాలలో కేవలం బియ్యపు పిండితో మాత్రమే ఉండ్రాళ్ళు తయారు చేసుకుంటారు. ఈ విధంగా తయారు చేసిన ఉండ్రాళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…