ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 10వ తేదీ రావడంతో భక్తులు వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి పండుగలో నైవేద్యాలు ఎంతో కీలకమైనవి. స్వామివారి అనుగ్రహం పొందడం కోసం భక్తులు పెద్దఎత్తున స్వామివారికి వివిధ నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ క్రమంలోనే స్వామివారికి కుడుములు ఎంతో ప్రీతికరం. మరి స్వామి వారికి ఎంతో ఇష్టమైన కుడుములను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా.
ముందుగా శనగపప్పును కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. ఆ తర్వాత ఉడికిన శనగపప్పులో బెల్లం వేసి చిన్న మంటపై రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శనగపప్పు బెల్లం, యాలకుల మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా గోధుమపిండితో ఉప్పు లేకుండా చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన గోధుమపిండిని చిన్న పూరీలా తయారు చేసుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు పూర్ణం వేసి, ఆ గోధుమ పిండి రేకులను కజ్జికాయల మాదిరిగా అల్లాలి. ఇలా చేసిన వాటిని బాగా మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన, వినాయకుడికి ఇష్టమైన కుడుములు తయారయినట్టే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…