సాధారణంగా చాలా మంది యువతీ యువకులకు పెళ్లి వయసు వచ్చినప్పటికీ ఎలాంటి పెళ్లి సంబంధాలు కుదరవు. అందుకు గల కారణం వారి జాతకంలో దోషాలు ఉండటమేనని పురోహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యువతీ యువకులు ఎన్నో ఆలయాలను దర్శించి గ్రహ దోష నివారణలు చేస్తుంటారు. అయితే పెళ్లి కాకుండా, పెళ్లి జరిగి సంతానం లేకుండా బాధ పడేవారు పెండ్లి గంగమ్మ ఆలయాన్ని దర్శిస్తే వారికి వివాహం జరుగుతుందని, సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. మరి ఈ పెండ్లి గంగమ్మ ఆలయం ఎక్కడ ఉంది ? ఈ ఆలయ విశిష్టత ఏమిటి అంటే..
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ పెండ్లి కనుమ అనే గ్రామంలో 300 ఏళ్లనాటి గంగమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రెండు బండ రాళ్ళు ఉంటాయి. ఈ బండరాళ్లు సుమారు 100 కేజీల పైగా ఉంటాయి. ఇందులో ఒకటి పెట్టరాయి కాగా, మరొకటి పుంజు రాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ ఆలయంలో ఉన్న బండరాళ్లను ఎత్తి కింద పడేస్తే చాలు వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
ఈ విధంగా ఈ ఆలయానికి ఎక్కువగా పెళ్లి కాని వారు, సంతానంలేని వారు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఈ బండరాళ్లను ఎత్తి కింద పడేస్తారు. రాయి మొత్తం పైకి ఎత్తాలి అనే నియమం లేకున్నప్పటికీ మనస్ఫూర్తిగా కొంతవరకైనా ఎత్తి కింద పడేయాలని ఇక్కడ భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…