సాధారణంగా మనం తరచుగా వెళ్లే ఆలయాలలో శివాలయం ఒకటి. శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా స్వామివారి లింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది.త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకునే సమయంలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఆ నియమాలు ఏమిటో స్వామి వారిని ఏ విధంగా నమస్కరించాలో ఇక్కడ తెలుసుకుందాం.
గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకునే సమయంలో మన మనసును ఆ భగవంతుని పై కేంద్రీకరించాలి.అదేవిధంగా స్వామివారిని దర్శనం చేసుకునే టప్పుడు స్వామివారి వాహనమైన నందీశ్వరుడు కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడికి నంది దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. శివలింగం నందీశ్వరుడు దర్శనం తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ఇతర విగ్రహం మూర్తులను దర్శనం చేసుకున్న అప్పుడే సంపూర్ణ దర్శనమవుతుంది.
శివలింగాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి దర్శనం చేసుకుంటున్నప్పుడు నంది పృష్ట భాగాన్ని నిమురుతూ, కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల నంది అనుగ్రహం కూడా మనపై కలిగి మన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా మన కోరికలను నందీశ్వరుడి చెవిలో చెప్పేటప్పుడు మన కుడిచేతిని నంది చెవికి అడ్డుగా పెట్టి మెల్లిగా మన గోత్రం పేరు మన కోరిక తెలియచెప్పాలి.ఆ తరువాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నందీశ్వరుని పాదాల దగ్గర పెట్టి పూజించాలి. ఈ విధంగా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుని దర్శించుకునే సమయంలో ఈ నియమాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…