సాధారణంగా మనం తరచుగా వెళ్లే ఆలయాలలో శివాలయం ఒకటి. శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా స్వామివారి లింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది.త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకునే సమయంలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఆ నియమాలు ఏమిటో స్వామి వారిని ఏ విధంగా నమస్కరించాలో ఇక్కడ తెలుసుకుందాం.
గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకునే సమయంలో మన మనసును ఆ భగవంతుని పై కేంద్రీకరించాలి.అదేవిధంగా స్వామివారిని దర్శనం చేసుకునే టప్పుడు స్వామివారి వాహనమైన నందీశ్వరుడు కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడికి నంది దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. శివలింగం నందీశ్వరుడు దర్శనం తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ఇతర విగ్రహం మూర్తులను దర్శనం చేసుకున్న అప్పుడే సంపూర్ణ దర్శనమవుతుంది.
శివలింగాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి దర్శనం చేసుకుంటున్నప్పుడు నంది పృష్ట భాగాన్ని నిమురుతూ, కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల నంది అనుగ్రహం కూడా మనపై కలిగి మన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా మన కోరికలను నందీశ్వరుడి చెవిలో చెప్పేటప్పుడు మన కుడిచేతిని నంది చెవికి అడ్డుగా పెట్టి మెల్లిగా మన గోత్రం పేరు మన కోరిక తెలియచెప్పాలి.ఆ తరువాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నందీశ్వరుని పాదాల దగ్గర పెట్టి పూజించాలి. ఈ విధంగా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుని దర్శించుకునే సమయంలో ఈ నియమాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…